Off The Record: బోండా ఉమా వ్యాఖ్యల రగడ వెనుక కథ ఇదే!
- బోండా ఉమా స్వపక్షంలో విపక్షంగా మారుతున్నారా?.. హైకమాండ్కు వీర విధేయుడినని అంటూనే కొత్త సమస్యలు.. కులం పేరుతో టీడీపీ అధిష్టానానికి తలనొప్పి.. కాపుల్లో అలజడి ఉందన్న వ్యాఖ్యలతో రాజకీయ కాక.. వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు ఆదేశాలు.. మంత్రి పదవి దక్కలేదన్న ఫ్రస్ట్రేషన్ ఉందా?.. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులని ఇటీవల కామెంట్.. ఈసారి టీడీపీ టిక్కెట్ రాకున్నా ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారా?..
- బోండా ఉమా డిసైడైనట్టే కనిపిస్తోందన్న అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే స్వపక్షంలో విపక్షంలా మారుతున్నారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో బలపడుతోంది. తన అసమ్మతిని ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో బయటపెడుతూనే ఉన్నారాయన. అయితే… ఎక్కడా తేడా రాకుండా… తాను హైకమాండ్కు వీర విధేయుడినని చెప్పుకుంటూనే… ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు తెచ్చి పెట్టడం గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో. గతంలో అధికారులతో విభేదాలుండేవి. ఆ మధ్య అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్నే టార్గెట్ చేశారాయన. ఇప్పుడైతే ఏకంగా సామాజిక వర్గం పేరుతో అధినాయకత్వానికి తల నొప్పి తెచ్చి పెట్టారు. పార్టీ ఎవరినైతే వద్దని భావించిందో.. వారినే ప్రశంసిస్తున్నారు బోండా. దీంతో… ఆయన ఎందుకిలా చేస్తున్నారు? భవిష్యత్ లెక్కలు మారుతున్నాయా…? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి టీడీపీ కాపు నేతల్లో మంచి వాయిస్ ఉన్న లీడర్ ఉమా మహేశ్వరరావు.
కానీ… ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి మద్దతుగా మాట్లాడుతూనే..వివాదం సృష్టించారనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో బలంగా ఉందట. ముద్రగడ పద్మనాభం సంతాప సభలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే… ప్రస్తుతం రాష్ట్రంలోని కాపుల్లో అలజడి ఉందన్నారు. టీడీపీ….2019లో ఓడి పోవడానికి ముద్రగడ పద్మనాభం ప్రధాన కారణం అని చెప్పారు. దీంతో… టీడీపీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. దాని గురించి పార్టీలో తీవ్ర స్థాయి చర్చ జరగడమే కాకుండా…. వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవద్దంటూ..సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యేదాకా వెళ్లింది వ్యవహారం. అసలు మొదట్నుంచి బోండా రూటే సపరేటు అన్నది పార్టీ వాయిస్. ఆయన అసెంబ్లీలో అయినా.. బయట అయినా ఒకే తీరున వ్యవహరిస్తారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో బోండా మంత్రి పదవి ఆశల ప్రస్తావన కూడా వస్తోంది. ఈసారి తనకు గ్యారంటీగా కేబినెట్ బెర్త్ దక్కుతుందని ఆశించారాయన. కానీ… తనకు ఇవ్వకుండా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాళ్ళకు ఇచ్చారంటూ ఆ మధ్య బహిరంగం గానే కామెంట్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వైసీపీలో మంత్రిగా చేసిన వ్యక్తే తిరిగి కూటమి ప్రభుత్వంలో కూడా మినిస్టర్ అవడం ఉమాకు నచ్చలేదని, అందుకే మొదట్నుంచి ఆగ్రహంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
Also Read
- Off The Record: జగన్ వార్నింగ్.. సింహపురి పాలిటిక్స్ లో హీట్..!
- OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
- OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
- OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ఈ పరిస్థితుల్లో… కాపు సామాజిక వర్గం ప్రస్తావన తీసుకురావడం కాక రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో అలజడి ఉందని అంటూ…. ఆయన తనలో ఉన్న అసంతృప్తిని బయట పెట్టినట్టు కనిపిస్తోందంటున్నారు కొందరు. మరోవైపు గతంలో పరోక్షంగా పవన్ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పరిధిలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. పీసీబీ పని చేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదని…. ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చైర్మన్ వద్దకు వెళ్తే.. ఉప ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారని, ఆయన ఆఫీసు నుంచి మాకు ఆదేశాలు రావాలని చెబుతున్నారంటూ ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావించారాయన. ఇక తాజాగా ముద్రగడ సంతాప సభలో చేసిన వ్యాఖ్యలతో వివాదం పీక్స్కు చేరింది. ముఖ్యంగా కాపుల్లో అలజడి వ్యాఖ్యలు పార్టీ నాయకత్వానికి అస్సలు నచ్చలేదట. సొంత పార్టీ లోనే… ఒక సీనియర్ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి ఉందంటూ… బహిరంగంగా మాట్లాడ్డం టీడీపీ నాయకత్వానికి రుచించటం లేదని టాక్.
ఇలాగే చూస్తూ ఊరుకుంటే…. ఇది మరింతగా ముదిరే ప్రమాదం ఉందని అధిష్టానం భావించినట్టు సమాచారం. అలాగే… వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకుంటే..తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని కూడా టీడీపీ భావిస్తోందట. అందుకోసనే తన వ్యాఖ్యల మీద బోండాను వివరణ కోరినట్టు సమాచారం. సరిగ్గా ఇక్కడే మరో చర్చ కూడా మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ రాకున్నా…. ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే తన రూట్ తాను సెట్ చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటి నుంచే తన మార్క్ రాజకీయం మొదలు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాను వైసీపీ వారితో కలిస్తే ఇబ్బంది అనుకుంటే….. ఇదే అంశానికి సంబంధించి జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ కలిసి పాల్గొన్నారని.. వారిని కూడా వివరణ కోరతారా అని ప్రశ్నిస్తున్నారాయన. దీంతో.. బోండా ఉమా పూర్తిగా డిసైడ్ అయినట్లే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు పార్టీ నాయకత్వం ఏం చేస్తుందనేదే ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అండ.. కీలక ప్రకటన..
-
Lok Sabha: ఫలించిన స్పీకర్ చొరవ.. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై రేపు చర్చ
-
AV Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్షన్.. ‘నిజం కోసం పోరాటం ఆగదు’
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!