తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై మళ్లీ అలజడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్లో మళ్లీ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక అలజడి రేపుతోందా? చాలా రోజుల తర్వాత AICC ఇంచార్జ్ రాష్ట్రానికి రావడంతో పార్టీలో ముఖ్య నేతలు ఆరా తీస్తున్నారా? అధిష్ఠానం పెట్టిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల గడువు దగ్గర పడటంతో కొత్త సారథిపై మంతనాలు జోరందుకున్నాయా?
పీసీసీ చీఫ్ ఎంపికపై ఇన్నాళ్లూ అలికిడి లేదు!
Also Read
నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ నియామకం ఉంటుందని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చడంతో దాదాపు 3 నెలలుగా పార్టీ నేతలు సైలెంట్గా ఉండిపోయారు. కొత్త పీసీసీ అంశంపై ఆశలు పెట్టుకోకుండా పూర్తిగా సాగర్ ఎన్నికలపై దృష్టి సారించారు చాలా మంది నాయకులు . AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సొంత రాష్ట్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ ఉండడంతో ఆయన ఎవరికీ అందుబాటులో లేకపోయారు. దీంతో ఆ దిశగా ఇన్నాళ్లూ అలికిడి లేదు.
ఠాగూర్ రాగానే వాకబు చేసిన నేతలు!
17తో నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ముగుస్తుంది. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నా.. వాటితో సంబంధం లేకుండా పీసీసీ చీఫ్ ఎంపికలో కదలిక తీసుకొచ్చే పనిలో ఉన్నారు నాయకులు. హైకమాండ్ పెట్టిన గడువు దగ్గర పడటంతో ఆశావహులపై ఇతరులు కూడా చర్చించే పరిస్థితి కనిపిస్తోంది. సాగర్ ఉపఎన్నిక కోసం ఇంఛార్జ్ ఠాగూర్ హైదరాబాద్ చేరుకోగానే కొందరు సీనియర్ నాయకులు ఆయన్ని కలిసి కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియపై ఆరా తీశారట. నివేదికను ఎప్పుడు పార్టీ చీఫ్ సోనియా గాంధీకి ఇస్తున్నారు అని వాకబు చేశారట. సాగర్ ఉపఎన్నిక అయిన మూడు నాలుగు రోజులు తర్వాత మేడమ్కు నివేదిక ఇవ్వబోతున్నట్టు ఠాగూర్ తనను కలిసి ఆరా తీసిన వారికి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది తెలిసినప్పటి నుంచి ఈ అంశంపై పార్టీలో చర్చ పీక్కు వెళ్లుతున్నట్టు సమాచారం.
కొత్తగా సంప్రదింపులకు ఆదేశించే ఛాన్స్ ఉందా?
ఇంఛార్జ్ ఠాగర్ నివేదిక ఇచ్చిన వెంటనే పీసీసీ కొత్త చీఫ్ను మేడమ్ సోనియాగాంధీ ప్రకటిస్తారా? లేక నాగార్జునసాగర్ ఉపఎన్నికతోపాటు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగుతారా అన్నది ఉత్కంఠగా మారింది. సోనియా కొంత సమయం తీసుకోవచ్చనే వారు ఉన్నారు. మొన్నటి వరకు రేస్లో వినిపించిన పేర్లలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని పరిగణనలోకి తీసుకుంటారా లేదా అని కొందరు ఢిల్లీ వరకు ఆరా తీస్తున్నారట. ఇప్పటి వరకు జరిగిన అభిప్రాయ సేకరణ పక్కన పెట్టి.. మళ్లీ కొత్తగా సంప్రదింపులకు ఆదేశిస్తారేమో అన్న అనుమానాలు ఉన్నాయట. కొత్తగా సంప్రదింపులకు నిర్ణయిస్తే మాత్రం.. పీసీసీ చీఫ్ ఎంపిక ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
గెలిస్తే జానారెడ్డి నివేదిక ఇచ్చే వీలుందా?
ఎంపీలు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సీరియస్గానే పీసీసీ చీఫ్ కుర్చీకోసం చూస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేను కూడా లైన్లో ఉన్నానని చెబుతున్నారు. ఉపఎన్నికలో జానారెడ్డి గెలిస్తే.. ఆయన కూడా రేస్లోకి రావొచ్చన్న టాక్ ఉంది. అయితే పీసీసీ చీఫ్ పోస్ట్పై తనకు ఆశ లేదని జానారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే మాత్రం.. ఎవరిని పీసీసీ సారథిని చెయ్యాలన్నదానిపై పార్టీ హైకమాండ్కు జానారెడ్డి నివేదిక ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
జానారెడ్డి అభిప్రాయానికి వెయిట్ పెరుగుతుందా?
కొత్త సారథి ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చిన సమయంలో జానారెడ్డి చెప్పినందువల్లే ప్రకటన ఆపినట్టు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇప్పుడు ఉపఎన్నికలో ఆయన గెలిస్తే.. జానారెడ్డి అభిప్రాయానికి వెయిట్ పెరుగుతుంది. మరి.. ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో.. మేడమ్ దృష్టిలో ఎవరు ఉన్నారో.. రేస్లో ఉన్నవారు కాకుండా కొత్త వారిని ఎంపిక చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

- Tags
- new tension
తాజావార్తలు
-
EVV Cinema: కోర్టు రోషన్’తో ఈవీవీ కుమారుడి సినిమా
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Samantha: ‘సామ్ జామ్’ తర్వాత హోస్ట్గా మళ్లీ సమంత.. తమిళంలో కొత్త టాక్ షో ప్లాన్?
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!