చంద్రబాబు నిర్ణయాలతో నేతల్లో గుబులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లా టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా..? సర్వే పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారా? తమ పదవులు ఉంటాయో లేదోనని ఆందోళన చెందుతున్న నాయకులు ఎవరు? ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను కలవరపెట్టేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి?
రాబిన్శర్మ బృందంతో టీడీపీ పరిస్థితిపై సర్వే..!
Also Read
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల టీడీపీ గెలిచింది. ఈ నలుగురిలో ఒకరు జారుకున్నా.. మిగిలిన వాళ్లంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా టీడీపీలో ఆశించిన స్థాయిలో జోష్ లేదు. దీంతో పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎప్పటిలా సర్వే బృందాలను రంగంలోకి దించారట చంద్రబాబు. రాబిన్శర్మ బృందాన్ని ఫీల్డ్లోకి పంపారట. ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉండగా పార్టీ అధినేత తీసుకున్న ఈ నిర్ణయంతో నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జుల్లో టెన్షన్ మొదలైందని సమాచారం.
‘పశ్చిమ’ నియోజకవర్గాల్లో మరింత లోతుగా సర్వే ..!
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి.. ఎమ్మెల్యేలు.. ఇంఛార్జుల పనితీరు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలు.. అందరినీ కలుపుకొని వెళ్తున్నారా లేదా అనే అంశాలపై సర్వే నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. జిల్లాలోని తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ కొంత బలంగా ఉన్నప్పటికీ.. పశ్చిమ నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. అందుకే పశ్చిమ నియోజకవర్గాల్లో మరింత లోతుగా రాబిన్శర్మ టీమ్ సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది.
సర్వే వివరాలు వచ్చాక.. టీడీపీ ఇంఛార్జులను మారుస్తారా?
కేవలం ప్రజల దగ్గరకే కాకుండా.. మేధావి వర్గాన్ని కూడా సర్వే బృందం కలిసి అభిప్రాయ సేకరణ చేస్తోందట. ఈ సర్వే ఫలితాల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లను కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో.. తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసిన చంద్రబాబు.. ఈ విషయంపై చాలా సీరియస్గానే దృష్టిపెట్టినట్టు చెబుతున్నారు. జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ఆశించిన స్థాయిలో పార్టీ బలంగా లేదన్న సంగతి సర్వే బృందాలకు అధిష్ఠానం చెప్పిందట. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు.. ప్రత్యామ్నాయం ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆరా తీస్తున్నారట. పూర్తిస్థాయి ప్రజాభిప్రాయ సేకరణ వివరాలు వచ్చాక పలువురు టీడీపీ ఇంఛార్జులను మారుస్తారనే ప్రచారం ఉంది.
సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే బాధ్యతలు..?
జిల్లాలో చీరాల, కందుకూరులకు టీడీపీ ఇంఛార్జులు లేరు. అక్కడ ఎవరిని ఇంఛార్జ్ను చేస్తే.. పార్టీకి బలం చేకూరుతుందో కూడా ఆరా తీయమన్నట్టు సమాచారం. సర్వే అనంతరం అన్నిచోట్లా గెలుపు గుర్రాలకే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయట. మరి.. రాబిన్శర్మ బృందం సర్వేలో పార్టీ బలోపేతానికి సూచించే అంశాలు టీడీపీకి ఎంత మేరకు వర్కవుట్ అవుతాయో.. ఎంతమంది కుర్చీలు కదులుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!