చంద్రబాబు నిర్ణయాలతో నేతల్లో గుబులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లా టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా..? సర్వే పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారా? తమ పదవులు ఉంటాయో లేదోనని ఆందోళన చెందుతున్న నాయకులు ఎవరు? ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను కలవరపెట్టేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి?
రాబిన్శర్మ బృందంతో టీడీపీ పరిస్థితిపై సర్వే..!
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల టీడీపీ గెలిచింది. ఈ నలుగురిలో ఒకరు జారుకున్నా.. మిగిలిన వాళ్లంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా టీడీపీలో ఆశించిన స్థాయిలో జోష్ లేదు. దీంతో పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎప్పటిలా సర్వే బృందాలను రంగంలోకి దించారట చంద్రబాబు. రాబిన్శర్మ బృందాన్ని ఫీల్డ్లోకి పంపారట. ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉండగా పార్టీ అధినేత తీసుకున్న ఈ నిర్ణయంతో నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జుల్లో టెన్షన్ మొదలైందని సమాచారం.
‘పశ్చిమ’ నియోజకవర్గాల్లో మరింత లోతుగా సర్వే ..!
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి.. ఎమ్మెల్యేలు.. ఇంఛార్జుల పనితీరు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలు.. అందరినీ కలుపుకొని వెళ్తున్నారా లేదా అనే అంశాలపై సర్వే నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. జిల్లాలోని తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ కొంత బలంగా ఉన్నప్పటికీ.. పశ్చిమ నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. అందుకే పశ్చిమ నియోజకవర్గాల్లో మరింత లోతుగా రాబిన్శర్మ టీమ్ సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది.
సర్వే వివరాలు వచ్చాక.. టీడీపీ ఇంఛార్జులను మారుస్తారా?
కేవలం ప్రజల దగ్గరకే కాకుండా.. మేధావి వర్గాన్ని కూడా సర్వే బృందం కలిసి అభిప్రాయ సేకరణ చేస్తోందట. ఈ సర్వే ఫలితాల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లను కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో.. తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసిన చంద్రబాబు.. ఈ విషయంపై చాలా సీరియస్గానే దృష్టిపెట్టినట్టు చెబుతున్నారు. జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ఆశించిన స్థాయిలో పార్టీ బలంగా లేదన్న సంగతి సర్వే బృందాలకు అధిష్ఠానం చెప్పిందట. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు.. ప్రత్యామ్నాయం ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆరా తీస్తున్నారట. పూర్తిస్థాయి ప్రజాభిప్రాయ సేకరణ వివరాలు వచ్చాక పలువురు టీడీపీ ఇంఛార్జులను మారుస్తారనే ప్రచారం ఉంది.
సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే బాధ్యతలు..?
జిల్లాలో చీరాల, కందుకూరులకు టీడీపీ ఇంఛార్జులు లేరు. అక్కడ ఎవరిని ఇంఛార్జ్ను చేస్తే.. పార్టీకి బలం చేకూరుతుందో కూడా ఆరా తీయమన్నట్టు సమాచారం. సర్వే అనంతరం అన్నిచోట్లా గెలుపు గుర్రాలకే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయట. మరి.. రాబిన్శర్మ బృందం సర్వేలో పార్టీ బలోపేతానికి సూచించే అంశాలు టీడీపీకి ఎంత మేరకు వర్కవుట్ అవుతాయో.. ఎంతమంది కుర్చీలు కదులుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
-
India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!