రాజ్యసభ ఆశిస్తున్న కల్వకుంట్ల కవిత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ నేత బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికి..? స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయిన వారిలో ఒకరిని ఢిల్లీకి పంపుతారా..? గులాబీ దళపతి కేసీఆర్ ప్లాన్ ఏంటి?
రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేస్తారు?
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బండ ప్రకాశ్ ముదిరాజ్ మూడేళ్ల ఎనిమిది నెలలే ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు కూడా అంతే ఉత్కంఠగా రాజ్యసభ పదవీ వదిలేసి ఎమ్మెల్సీ పదవీకి ఎన్నికయ్యారు. తెలంగాణ కేబినెట్లోకి తీసుకునే ఉద్దేశంతో ఆయన్ను ఎమ్మెల్సీ చేసినట్టు సమాచారం. 2018 మార్చిలోరాజ్యసభకు బండ ప్రకాశ్ ఎన్నికయ్యారు. మరో రెండు సంవత్సరాల ఎనిమిది నెలల సమయం మిగిలి ఉంది. ఇప్పుడు ఈ పదవి టీఆర్ఎస్లో ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ.
ఢిల్లీ వెళ్లేందుకు కవిత ప్లాన్..!
కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు.భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపుతో వచ్చిన ఉపఎన్నికలో నాడు కవిత ఎమ్మెల్సీగా గెలిచారు.
దాదాపు రెండేళ్లపాటు ఆ పదవిలో ఉండగా.. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు కవిత. మరోసారి ఢిల్లీకి వెళ్లేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీలో క్రియాశీలం కావడానికి ప్రయత్నం..!
ఎమ్మెల్సీగా ఇప్పుడు మరోసారి గెలిస్తే 2024లో సాధారణ ఎన్నికల సమయానికి పదవీకాలం పూర్తికాదు. రాజ్యసభ ఉపఎన్నికకు వెళితే మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చని ఆలోచిస్తున్నారు కవిత. అలాగే రాజ్యసభకు ఎన్నికై ఢిల్లీలో క్రియాశీలం కావడానికి.. అధినేత కేసీఆర్ను కవిత కోరినట్టు సమాచారం. మారిన రాజకీయ పరిస్థితులతో హస్తినకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 23 వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఆలోపు కవిత ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తారా లేదా అన్నది తేలనుంది. ఒకవేళ నామినేషన్ వేయకపోతే.. రాజ్యసభకు పంపుతారా అన్నది చూడాలి.
వచ్చే ఏడాది రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ..!
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ను రాజ్యసభకు పంపాలనే ఆలోచన కూడా ఉన్నట్టు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వినోద్ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్గా కేబినెట్ హోదాలో ఉన్నారు. వచ్చే ఏడాది మరో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి శ్రీనివాస్ పదవీ కాలం ముగియనుంది. ఇప్పుడు ఎవరిని రాజ్యసభకు పంపుతారు ? వచ్చే ఏడాది ఎవరిని పంపుతారు ? అన్నది ఉత్కంఠగా ఉంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!