Munugode Congress Candidate : మునుగోడు అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ అయోమయంలో పడుతోందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode Congress Candidate
మునుగోడు అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోందా? పాత వారికి టికెట్ ఇస్తే జరిగే పరిణామాలపై అంచనాలు వేస్తోందా? కొత్త వారికి టికెట్ ఇస్తే పరిస్థితి ఏంటనే ఆలోచనలో ఉన్నారా? ఇంతకీ వడపోతలు ఎంతవరకు వచ్చాయి? లెట్స్ వాచ్..!
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోయినా.. ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడుతోంది కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థి ఎంపికే పెద్ద సవాల్గా మారింది. క్యాండిడేట్ విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేది తేల్చుకోలేకపోతున్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్లో టికెట్ ఆశిస్తున్న నలుగురు… బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే. పల్లె రవి, కైలాష్ నేతతోపాటు.. పాల్వాయి గోవర్దన్రెడ్డి కుమార్తె స్రవంతి.. మరో నాయకుడు చెలమల కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అయితే మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ బలమైన వ్యూహ రచనలో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన కూడా ఆ స్థాయిలో ఉండాలని లెక్కలేస్తున్నారట.
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Off The Record: పాలకొల్లు వైసీపీకి ఎందుకు కలిసిరావడం లేదు?
- Off The Record: ఆ 24 మంది ఎవరు? తాడిపత్రిలో జేసీ సంచలన హెచ్చరిక
సీనియర్లను గుర్తించడం.. క్యాడర్ను కాపాడుకోవడం.. ఆర్థికంగా ఫైట్ ఇవ్వడం కాంగ్రెస్కు చాలా ముఖ్యం. ఈ కోణంలోనే అభ్యర్థి కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్లో ఆర్థికంగా బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారట చలమల కృష్ణారెడ్డి. డబ్బులు పెట్టడంతోపాటు నియోజకవర్గంలో ఫేస్ కూడా ఉందనే చర్చ నడుస్తోందట. అయితే కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే… క్యాడర్ ఆయనకు సహకరిస్తారా? పాల్వాయి స్రవంతి వర్గం ఎలా స్పందిస్తుంది? అనే అనుమానాలు ఉన్నాయట.
ఒకవేళ పాల్వాయి స్రవంతికి టికెట్ ఇస్తే… కలిసి వచ్చేది ఎంత మంది..? క్యాడర్ను కాపాడుకోగలరా? అనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట. మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ తన సీటును కాపాడుకోవాలి.. లేదా రెండో ప్లేస్లోనైనా ఉండలి. ఈ రెండూ లేదంటే రాజకీయంగా కాంగ్రెస్కు తెలంగాణలో ఇబ్బంది ఎదురవుతుందనే ఆందోళన నాయకుల్లో ఉందట. అందుకే కృష్ణారెడ్డి, స్రవంతిలలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్నది తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం.
పార్టీ నాయకత్వమే ఎన్నికల ఖర్చు భరిస్తే.. బీసీ అభ్యర్థిని బరిలో దించి.. టీఆర్ఎస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టాలనే వాదన ఉందట. ఈ అంశంపై కూడా పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మరి.. వడపోతలు.. సమీక్షలు.. సమావేశాల తర్వాత ఢిల్లీకి ఎవరి పేరును పంపుతారు? ఎవరికి అవకాశం ఇస్తారనేది కాంగ్రెస్ వర్గాలకు ఆసక్తి కలిగిస్తోంది. మరి హైకమాండ్ ఎవరికి టిక్ పెడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!