Munugode Congress Candidate : మునుగోడు అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ అయోమయంలో పడుతోందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode Congress Candidate
మునుగోడు అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోందా? పాత వారికి టికెట్ ఇస్తే జరిగే పరిణామాలపై అంచనాలు వేస్తోందా? కొత్త వారికి టికెట్ ఇస్తే పరిస్థితి ఏంటనే ఆలోచనలో ఉన్నారా? ఇంతకీ వడపోతలు ఎంతవరకు వచ్చాయి? లెట్స్ వాచ్..!
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోయినా.. ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడుతోంది కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థి ఎంపికే పెద్ద సవాల్గా మారింది. క్యాండిడేట్ విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేది తేల్చుకోలేకపోతున్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్లో టికెట్ ఆశిస్తున్న నలుగురు… బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే. పల్లె రవి, కైలాష్ నేతతోపాటు.. పాల్వాయి గోవర్దన్రెడ్డి కుమార్తె స్రవంతి.. మరో నాయకుడు చెలమల కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అయితే మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ బలమైన వ్యూహ రచనలో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన కూడా ఆ స్థాయిలో ఉండాలని లెక్కలేస్తున్నారట.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
సీనియర్లను గుర్తించడం.. క్యాడర్ను కాపాడుకోవడం.. ఆర్థికంగా ఫైట్ ఇవ్వడం కాంగ్రెస్కు చాలా ముఖ్యం. ఈ కోణంలోనే అభ్యర్థి కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్లో ఆర్థికంగా బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారట చలమల కృష్ణారెడ్డి. డబ్బులు పెట్టడంతోపాటు నియోజకవర్గంలో ఫేస్ కూడా ఉందనే చర్చ నడుస్తోందట. అయితే కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే… క్యాడర్ ఆయనకు సహకరిస్తారా? పాల్వాయి స్రవంతి వర్గం ఎలా స్పందిస్తుంది? అనే అనుమానాలు ఉన్నాయట.
ఒకవేళ పాల్వాయి స్రవంతికి టికెట్ ఇస్తే… కలిసి వచ్చేది ఎంత మంది..? క్యాడర్ను కాపాడుకోగలరా? అనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట. మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ తన సీటును కాపాడుకోవాలి.. లేదా రెండో ప్లేస్లోనైనా ఉండలి. ఈ రెండూ లేదంటే రాజకీయంగా కాంగ్రెస్కు తెలంగాణలో ఇబ్బంది ఎదురవుతుందనే ఆందోళన నాయకుల్లో ఉందట. అందుకే కృష్ణారెడ్డి, స్రవంతిలలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్నది తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం.
పార్టీ నాయకత్వమే ఎన్నికల ఖర్చు భరిస్తే.. బీసీ అభ్యర్థిని బరిలో దించి.. టీఆర్ఎస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టాలనే వాదన ఉందట. ఈ అంశంపై కూడా పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మరి.. వడపోతలు.. సమీక్షలు.. సమావేశాల తర్వాత ఢిల్లీకి ఎవరి పేరును పంపుతారు? ఎవరికి అవకాశం ఇస్తారనేది కాంగ్రెస్ వర్గాలకు ఆసక్తి కలిగిస్తోంది. మరి హైకమాండ్ ఎవరికి టిక్ పెడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!