YCP MLC UdayaBabu :ఎవరి సపోర్ట్ లేకపోవడంతో ఆ ఎమ్మెల్సీ కి దిక్కుతోచడం లేదా..?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసులో ఆయనపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఎమ్మెల్సీ. ఈ అంశంపై విపక్షాల వాయిస్ పెరగడంతో రచ్చ రచ్చ అవుతోంది. దీంతో అనంతబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. జిల్లాకు చెందిన వైసీపీ నేతలు.. మంత్రులుతో ఆయన టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలని కోరారట అనంతబాబు. అయితే ఎమ్మెల్సీ విన్నపానికి పార్టీ నేతలు పెద్దగా రెస్పాండ్ కాలేదట. కొందరైతే కనీసం కాంటాక్ట్లోకి కూడా రాలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
దారిన పోయే కంప ఒంటికి తగిలించుకోవడం ఎందుకని అనుకుంటున్నారట చాలా మంది వైసీపీ నేతలు. సున్నితమైన అంశాలలో జోక్యం చేసుకోకపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఈ రచ్చకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. దాంతో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏం చేయాలో అంతుచిక్కడం లేదట. కష్టకాలంలోనే కదా తనకు అండగా ఉండాలని సన్నిహితుల దగ్గర మొర పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. కాకినాడలో 20న జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు వచ్చారు. వారిని కలవడానికి ఒక అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ కోరినా ఎవరూ ఆసక్తి చూపించలేదట.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
వైసీపీ పెద్దలు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని అనంతబాబు కోరినట్టు సమాచారం. దాంతో పార్టీ పెద్దలకు అన్ని విషయాలు తెలుసని.. సరైన సమయంలో వారు స్పందిస్తారని కొందరు హితబోధ చేశారట. అయినా ఏ తప్పు చేయనప్పుడు ఆందోళన ఎందుకని వ్యంగ్యాస్త్రాలు సంధించారట. మరి అంత ర్యాష్గా ప్రవర్తించడం అవసరమా అని ఎమ్మెల్సీకి చెప్పిన వాళ్లూ ఉన్నారట. శుక్రవారం సాయంత్రం ప్రెస్మీట్ పెడతానని అనంతబాబు ముందుగా ప్రకటించారు. ఇంతలో వైసీపీ పెద్దల నుంచి అక్షింతలు పడ్డాయని ప్రచారం జరుగుతోంది. చేసిన నిర్వాకం చాలు.. కంట్రోల్లో ఉండాలని అన్నారట. ప్రెస్మీట్ పెట్టి లేనిపోని తలనొప్పులు తేవొద్దని గట్టిగానే హెచ్చరించారట. మరీ డైరెక్ట్గా సీన్లో ఇన్వాల్వ్ కావడంతో అంతా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఒంటరి అయ్యారు. లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెట్టుకోవడం ఎందుకని దూరం జరుగుతున్నారట. పార్టీ పెద్దలు సీరియస్గా తీసుకోవడం వల్లే అటు వైపు కన్నెత్తి చూడడం లేదని చెబుతున్నారు. మరి.. ఈ సమస్య ఎలాంటి మలుపు తిరుగుతుందో.. ఎమ్మెల్సీ ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు!
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!