Telugu Desam Party : టీడీపీలో హీరో ఎన్టీఆర్ అంశం కలకలం రేపుతోందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Desam Party : టీడీపీలో మళ్లీ హీరో ఎన్టీఆర్ అంశం కలకలం రేపుతోంది. ప్రత్యర్థి పార్టీలు ఎన్టీఆర్ పేరును పదే పదే ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నాయి. ఇది టీడీపీకి మింగుడు పడటం లేదు. తెగించి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదట. అధినేత ఫ్యామిలీ మేటర్ కావడంతో ఎవరికి వారు గప్చుప్ అంటున్నారట. ఎందుకలా? లెట్స్ వాచ్..!
జూనియర్ ఎన్టీఆర్తో బీజేపీ అగ్రనేత.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ ముహూర్తన భేటీ అయ్యారో కానీ.. అప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో హీరో పేరు మార్మోగిపోతోంది. తమ పార్టీ ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు.. ఏపీ బీజేపీ నేతలు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ఇంకోవైపు అధికారపార్టీ వైసీపీ అయితే టీడీపీని.. చంద్రబాబును కార్నర్ చేస్తోంది. ఏతావాతా టీడీపీ వైరిపక్షాలన్నీ ఎన్టీఆర్ జపం అందుకున్నాయనే చెప్పాలి.
Also Read
ఏపీలో ఎన్టీఆర్ విషయంలో వైసీపీ, బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్కు టీడీపీ నాయకులకు సర్రుమంటోందట. అక్కడ జరిగిందేంటో..? జరగబోయేదేంటో..? కానీ.. టీడీపీ నేతలు తీవ్ర అసహనంలో ఉన్నారట. అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ కేవలం ట్రిపుల్ ఆర్ సినిమాకే పరిమితమని.. అంతకు మించి రాజకీయ ప్రాధాన్యం లేదని ముక్తసరిగా స్పందిస్తున్నారు. ఆ మధ్య బుద్దా వెంకన్న అదే చేశారు. మిగతా వాళ్లు ఈ సమస్య తమకు పట్టని అంశంగా లైట్ తీసుకుంటున్నారట. కానీ.. లోలోన మాత్రం ఉడికిపోతున్నారట టీడీపీ నేతలు.
గట్టిగా కౌంటర్ ఇద్దామని స్క్రీన్ ముందుకు వద్దామా.. అంటే ఏం చేయలేని పరిస్థితిలో టీడీపీ లీడర్లు ఉన్నారట. జూనియర్ ఎన్టీఆర్ అనగానే అది ఫ్యామిలీ మేటర్గానే పరిగణిస్తున్నారట. గతంలో ఒకటిరెండు సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన వారికి అధినాయకత్వం నుంచి అక్షింతలు పడ్డాయి. దాంతో తాజా రగడలో రియాక్ట్ అవుదామన్నా.. మనకెందుకు వచ్చిన గొడవలే అని నేతలు సైడ్ అవుతున్నారట. కాకపోతే అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి మాత్రం కౌంటర్ ఇచ్చి తీరాలనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట.
చంద్రబాబుకు కౌంటర్గా జూనియర్ను బీజేపీకి తెర మీదకు తెస్తోందని.. టీడీపీలో ఉన్న చాలా మంది బీజేపీ పంచన చేరతారనే రీతిలో వైసీపీ నేతల కామెంట్స్ ఉన్నాయి. కొందరు బీజేపీ నేతలు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని తమ అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నారట. వీటికి చెక్ పెట్టకపోతే టీడీపీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళన పార్టీలో ఉందట. ఇప్పుడు అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ అని కాదుకానీ.. 2019 తర్వాత టీడీపీలో అడపాదడపా ఎన్టీఆర్ పేరుపై రచ్చ అవుతూనే ఉంది. కుప్పంలో తరచూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు… బ్యానర్లు.. జెండాలు కనిపిస్తున్నాయి. ఆ మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆయన సమక్షంలోనే కేడర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్నించిన పరిస్థితి. ఆ సమయంలో చంద్రబాబు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. కృష్ణాజిల్లాలోనూ జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కలకలం రేపాయి. అలాగే పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని ప్రకటన చేశారు. ఇలా వివిధ సందర్భాల్లో ఎన్టీఆర్ అంశం చర్చగా మారుతూనే ఉంది.
గతంలో ఒకసారి టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు కానీ.. తర్వాత టీడీపీ కార్యక్రమాల్లో కనిపించింది లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాల్లో బిజీ అయ్యారు. వివిధ సందర్భాల్లో రాజకీయాలపై మీడియా ప్రశ్నించినా.. ఇది సమయం సందర్భం కాదని సమాధానం దాటవేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు అమిత్షా జరిగిన భేటీ కొత్త రచ్చకు కారణమైంది. మరి.. టీడీపీ వీటికి సమాధానం చెబుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్లో ఏముంది?
-
Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
-
Srikanth Odela: ‘దసరా’ కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో ‘ప్యారడైజ్’..
-
H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
-
Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!