Congress : మహిళా కాంగ్రెస్ లో పంచాయితీలు తారా స్థాయికి చేరాయా.? ఎందుకా పరిస్థితి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మహిళా కాంగ్రెస్లో గొడవలు చినికి చినికి గాలి వానాలా మారిపోయాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తీరే వివాదాలకు కారణమన్నది కొందరి వాదన. ప్రశ్నించినా.. చెప్పిన పని చేయకపోయినా వారిని వెంటనే పార్టీ నుంచి బయటకు పంపేస్తున్నారట. ఇటీవల మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగితే… ఓ రేంజ్లో రసాభాస అయ్యింది. దుర్భాషలాడారనే అభియోగాలతో మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు పదవి నుంచి కవితామహేష్ను తప్పించారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నది గాంధీభవన్ వర్గాల టాక్.
మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సునీతారావు ఎన్నికైన మొదట్లోనే.. కమిటీలో ఉన్న కొందరు నిత్యం ఫిర్యాదులు చేసుకుంటూ పోయారు. ఆ తర్వాత దాదాపు పదినుంచి పదిహేను మందిని పార్టీ పదవుల నుంచి ఆమె తప్పించారట. ఈ విషయంలో కారాలు మిరాయాలు నూరుతోంది సునీతారావు వ్యతిరేకవర్గం. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు మహిళా నేతలు హైదరాబాద్ వచ్చిన మహిళా కాంగ్రెస్స్ జాతీయ అధ్యక్షురాలు డిసౌజాకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్లో ప్రస్తావించిన ఆరోపణలు.. పార్టీని.. పదవులను మరింత దిగజార్చేలా ఉన్నాయని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.
Also Read
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్గౌడ్.. మహిళా కాంగ్రెస్ విభాగానికి ఇంఛార్జ్గా ఉంటున్నారు. ఆయనతో కూడా సునీతారావుకు గ్యాప్ కొనసాగుతోందట. అసంతృప్త మహిళా నేతలు.. నిత్యం మహేష్గౌడ్కు ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడీ సమస్య మరింత పెరిగి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి దగ్గరకు చేరిందట. ఇటీవల కాలంలో పీసీసీ చీఫ్తో భేటీ అవుతున్న మహిళా నేతలు సునీతారావుపై ఫిర్యాదుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట. సునీతారావు నియంతలా మారారనేది అన్ని ఫిర్యాదుల సారాంశంగా ఉందట. తొలుత మహేష్గౌడ్, తర్వాత రేవంత్రెడ్డి, ఆపై AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు డిసౌజా వరకు కంప్లయింట్లు చేరుకున్నాయి.
ఈ మధ్యకాలంలో మహిళా కాంగ్రెస్ నుంచి జరిగినన్ని తొలగింపులు పీసీసీ పరిధిలోనూ లేవట. రేవంత్ తీరుపై కొందరు కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సునీతారావుపై అంతకుమించిన వ్యతిరేకత మహిళా నేతల్లో ఉందట. ఈ గొడవలతో తల బొప్పికట్టిందో ఏమో.. మహిళా కాంగ్రెస్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్గౌడ్.
చాలాకాలం తర్వాత కాంగ్రెస్లో మహిళా విభాగం కార్యక్రమాలు పెరిగాయి. కానీ.. సునీతారావు వ్యవహార శైలే మిగతావాళ్లకు మింగుడు పడటం లేదట. ప్రస్తుతం అందరి దృష్టీ ఫిర్యాదులు అందుకున్న మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు డిసౌజాపై ఉంది. ఆమె ఏం చేస్తారు? పీసీసీ పెద్దలతో, AICC ఇంఛార్జ్తో మాట్లాడి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? లేక సమస్యను రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకోవాలని వదిలేస్తారో తెలియదు. మరి.. ఈ సిగల రగడపై కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..