Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Ex Minister Jana Reddy Sons Active In Politics

జానారెడ్డి తనయులు దూకుడు పెంచారా?

Published Date :November 27, 2021 , 3:30 pm
By Manohar
జానారెడ్డి తనయులు దూకుడు పెంచారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆ నాయకుడు గతంలోనే ప్రకటించినా.. ఉపఎన్నికలో పోటీ చేయక తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారో లేదో తెలియదు. కానీ.. ఆయన ఇద్దరు తనయులు మాత్రం చెరో నియోజకవర్గాన్ని ఎంచుకుని.. కాలికి బలపం కట్టుకున్నట్టుగా తిరిగేస్తున్నారు. దీంతో పెద్దాయన దారెటు అని కేడర్‌లోనూ.. పార్టీలోనూ చర్చ మొదలైంది.

వారసులను రంగంలోకి దించేశారా?

కుందూరు జానారెడ్డి. చాలాసార్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ వచ్చారు ఈ మాజీ మంత్రి. 2018లో నాగార్జునసాగర్‌లో ఓడిన తర్వాత కామైపోయారు. ఇంతలో ఉపఎన్నిక రావడంతో బలవంతంగా బరిలో దిగారు. మళ్లీ ఓడిన తర్వాత ప్రస్తుత రాజకీయాలపట్ల ఆయన ఒకింత ఆవేదనతో ఉన్నట్టు కనిపించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో తెలియదు. వారసులను మాత్రం ఇప్పటి నుంచే రంగంలోకి దించేస్తున్నారట.

ఉపఎన్నికలో తండ్రి తరఫున తనయులే ప్రచారం..!

మాజీ మంత్రి జానారెడ్డికి ఇద్దరు తనయులు. ఒకరు రఘువీర్‌.. రెండో కుమారుడు జైవీర్‌. ఇద్దరూ పొలిటికల్‌గా యాక్టివ్‌గానే ఉంటున్నారు. గతంలో తండ్రి ఎమ్మెల్యేగా గెలిచిన నాగార్జునసాగర్‌లో జైవీర్‌రెడ్డి విస్తృతంగా పర్యటనలు సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో ఒక్కటే మంతనాలు. రేపోమాపో ఎన్నికలన్నట్టు హడావిడి చేస్తున్నారు జానా రెండో తనయుడు. గతంలో ఇదే నియోజకవర్గలో జానా పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డి తండ్రి తరఫున బాధ్యతలు చూస్తూ ఉండేవారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికలో మాత్రం ఇద్దరు అన్నదమ్ములు కలిసి ప్రచారాన్ని పర్యవేక్షించారు.

నాగార్జునసాగర్‌లో జైవీర్‌ చురుకుగా పర్యటనలు..!
మిర్యాలగూడపై రఘువీర్‌ ఫోకస్‌..!

రఘువీర్‌ ప్రస్తుతం నాగార్జునసాగర్‌పై పెద్దగా ఫోకస్‌ పెట్టడం లేదట. అంతా జైవీర్‌ హవా నడుస్తోందట. తండ్రిలా కూల్‌గా కాకుండా.. కొంత దూకుడుగా కార్యకర్తల దగ్గరకు వెళ్తున్నారట. దీంతో వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్‌లో జానారెడ్డి పోటీ చేస్తారా లేక జైవీర్‌ బరిలో ఉంటారా అనే చర్చ మొదలైంది. అయితే రఘువీర్‌ పరిస్థితి ఏంటి? దీనిపైనా చర్చ స్టార్ట్‌. నాగార్జునసాగర్‌కు ఆనుకుని ఉండే మిర్యాలగూడపై పెద్దబ్బాయి ఫోకస్‌ పెట్టారట. 2018 ఎన్నికల్లోనే మిర్యాలగూడ నుంచి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు రఘువీర్‌రెడ్డి. పాదయాత్రలు చేశారు. కానీ.. ఒకే ఇంట్లో రెండు టికెట్ల పీటముడి కారణంగా జానా తనయుడికి పార్టీ టికెట్‌ నిరాకరించింది.

పరిస్థితులకు అనుగుణంగా జానా పావులు కదుపుతారా?

ఇప్పుడు కూడా ఒకే ఇంట్లో రెండు టికెట్ల ఇవ్వబోమనే రూల్‌ ఉంటుందో లేదో కానీ.. మళ్లీ మిర్యాలగూడలో పని మొదలుపెట్టేశారు రఘువీర్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారట. జానారెడ్డికి మిర్యాలగూడ ప్రాంతంలో పరిచయాలు ఉన్నాయి. అది కూడా పెద్దబ్బాయికి కలిసి వస్తుందని పార్టీ వర్గాల అంచనా. ఇంత వరకు బాగానే ఉన్నా.. జానారెడ్డి భవిష్యత్‌ కార్యాచరణ ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న. క్రమంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకొని.. పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపుతారనే చర్చ ఉంది.

గెలిస్తే చాలని.. జానా తనయులకు టికెట్లు ఇస్తారా..?

తెలంగాణలో బలం పుంజుకోవాలి.. శక్తి చాటాలా అన్నది కాంగ్రెస్‌ ఆలోచన. ఈ పరిస్థితుల్లో జానారెడ్డి కుటుంబానికి రెండు సీట్లు ఇస్తారా? గెలిస్తే చాలు.. ఒకే ఇంట్లో రెండు సీట్లు పెద్ద సమస్య కాదని పార్టీ భావించొచ్చు అన్నది కొందరి వాదన. పైగా జానారెడ్డికి పెద్దకుమారుడినని చెప్పుకొన్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చక్రం తిప్పి రఘువీర్‌, జైవీర్‌లకు టికెట్లు ఇప్పిస్తారో లేదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • active politics
  • congress
  • ex minister
  • ex minister jana reddy
  • jana reddy sons

తాజావార్తలు

  • Fake IAS Officer: నిత్య పెళ్లికొడుకు బాగోతం.. నకిలీ ఐఏఎస్‌గా 25 సార్లు పెళ్లిళ్లు.. ఎలా చిక్కాడంటే!

  • PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ

  • CM Revanth Reddy: ప్రతి కుటుంబానికి భరోసా.. దేశంలో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదు

  • Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!

  • PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions