YCP : రాజకీయం అంటే అంత ఈజీ కాదని ఆ ఇద్దరికీ తెలిసొచ్చిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం వైసీపీ వర్గ విభేదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఈస్థాయిలో ఎక్కడా వర్గపోరు లేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నవీన్ నిశ్చల్ను కాదని.. 2019లో మాజీ పోలీస్ అధికారి మహ్మద్ ఇక్బాల్కు టికెట్ ఇచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని టాక్. బాలకృష్ణ చేతిలో ఇక్బాల్ ఓడినా.. తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీని చేశారు. అప్పటి నుంచి హిందూపురంలో ఇక్బాల్ పెత్తనం పెరిగడం.. నవీన్ వర్గానికి అస్సలు రుచించడం లేదట. ఇది చాలదన్నట్టుగా ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లీడ్ రోల్ తీసుకోవడం స్థానిక వైసీపీని మూడు ముక్కలాటగా మార్చేసింది.
ఇక్బాల్, మాధవ్ వర్గాల తీరు నవీన్ శిబిరానికి మింగుడు పడటం లేదు. పార్టీలో పెత్తనం చేయడం.. తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో రగిలిపోతున్నారట. ఇంతలో నవీన్ నిశ్చల్కు ఆగ్రోస్ ఛైర్మన్గా నామినేటెడ్ పదవి ఇచ్చినా వారం రోజులుగా హిందూపురం వైసీపీలో మారుతున్న పరిణామాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎంపీ మాధవ్లకు వ్యతిరేకంగా పార్టీలోని మరోవర్గం వేగంగా పావులు కదుపుతోంది. కర్నాటకలోని దేవనహళ్లి సమీపంలో ఉన్న ఒక రిసార్ట్లో ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఆ భేటీకి హిందూపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్, చిలమత్తూరు, లేపాక్షి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కొందరు కౌన్సిలర్లు, వైసీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు.
Also Read
రహస్య భేటీలో చర్చించిన అంశాలకు అనుగుణంగా ఫీల్డ్లోకి దిగాలని నిర్ణయించిన వైసీపీ నేతలు.. ఈసారి హిందూపురంలోనే దుకాణం పెట్టేశారు. బాలయేసు కాలేజీలో మరోసారి ఎంపీ, ఎమ్మెల్సీలకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారట. ఈ సమావేశానికి నవీన్ నిశ్చల్తోపాటు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ బలరామిరెడ్డితోపాటు 12 మంది కౌన్సిలర్లు, లేపాక్షి, చిలమత్తూరు ఎంపీపీలు, లేపాక్షి వైస్ ఎంపీపీ హాజరుకావడంతో అసమ్మతి హీట్ పెరిగింది. హిందూపురం వైసీపీలో నాయకుడంటూ ఉండాలంటే.. లోకల్ వారై ఉండాలని.. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే కుదరబోదని చర్చించారట. అదే విషయాన్ని వైసీపీ హైకమాండ్కు చేరవేయాలని నిర్ణయించారట. 2024 వరకు వారి పెత్తనం ఇలాగే ఉంటే.. వైసీపీ గెలవడం ఎలా ఉన్నా.. పరిస్థితులు దిగజారిపోతాయని పరోక్షంగా హెచ్చరిస్తున్నాయట. ఎమ్మెల్సీ, ఎంపీలకు వార్నింగ్ ఇచ్చేలా పావులు కదుపుతున్నట్టు చర్చ జరుగుతోంది.
మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిని వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి కట్టబెట్టారని.. ఆ పదవిని పార్టీ కోసం పని చేసిన బీసీలకు ఇవ్వాలని రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో తీర్మానం చేశారట. 20మంది కౌన్సిలర్లతోపాటు వైస్ ఛైర్మన్ బలరాంరెడ్డి సంతకం చేసిన ఆ తీర్మానం కాపీని పార్టీ పెద్దలకు ఇవ్వాలని నిర్ణయించారట. అలాగే హిందూపురం వైసీపీ ఇంఛార్జ్గా కొత్త వ్యక్తిని నియమించాలని.. ఎమ్మెల్సీ, ఎంపీల పెత్తనం వద్దని మరో తీర్మానం చేశారట. ఆ తీర్మానాల కాపీలను వైసీపీ పెద్దలకు అందజేసేందుకు తాడేపల్లిలో వాలిపోయారు అసమ్మతి నేతలు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను కలిసేందుకు నిర్ణయించారట. మరి.. ఈ రగడకు పార్టీ పెద్దలు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.
- Tags
- Balakrishna
- hindupuram
- Iqbal
- tdp
- ycp
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!