BJP : ఆ జిల్లా బీజేపీలో విబేధాలు శృతిమించాయా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి బీజేపీలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. రెండు వర్గాలకు చెందిన నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకులు, కార్పొరేటర్ అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ రోడ్డున పడటం చర్చగా మారింది. గోపన్పల్లి రహదారిపై ఘర్షణకు దిగడంతో పార్టీలోని అంతర్గత విభేదాలు అందరికీ తెలిసిపోయింది. అసెంబ్లీ బీజేపీ ఇంఛార్జ్ గజ్జెల యోగానంద్తో సహా పలువురు నాయకులు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్రెడ్డితో జరిగిన వాగ్వాదం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
ప్రస్తుతం నియోజకవర్గం బీజేపీలో మూడు గ్రూపులు ఉండటంతో కార్యకర్తలు ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్థంకాని పరిస్థితి. బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఒకరు దగ్గరైతే.. మరొకరు బండి సంజయ్ ముఖ్య అనుచరుడు.. ఇంకొకరు కేంద్ర మంత్రులకు కావాల్సిన వ్యక్తి. ఇలా ఎవరికి వారు హోదా చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరంటే మరొకరికి చిన్నచూపు. పరస్పరం దాడులు.. ఆరోపణలు చేసుకోవడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందనేది కేడర్ ఆవేదన. శేరిలింగంపల్లిలో గజ్జెల యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, రవికుమార్యాదవ్లు ఆ వర్గాలకు నేతృత్వం వహిస్తున్నారు.
ఇటీవల రవికుమార్ అనుచరుడైన కార్పొరేటర్ గంగాధర్రెడ్డికి సంబంధించిన ప్రైవేటు స్థలానికి వెళ్లి యోగానంద్, మొవ్వ సత్యనారాయణ అనుచరులు ఫోటోలు తీశారు. అయితే వాళ్లంతా గోపన్పల్లిలోని చెరువులను సందర్శించారు. ఆ సమయంలో వారిపై దాడి జరిగింది. అడ్డుకోబోయిన మొవ్వ సత్యనారాయణను కూడా వదల్లేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీయడంతోపాటు.. బీజేపీలోనూ కలకలం రేపింది.
ఒక నాయకుడికి చెందిన ప్రైవేటు ఆస్తులు, భవనాలు, ఇతర విషయాల్లో మరో నాయకుడు జోక్యంతో దాడులు చేసుకునే వరకు సమస్య వెళ్లింది. పోలీసులు విచారణ చేస్తుండగానే.. ఈ అంశంపై మూడు వర్గాలు వేర్వేరుగా పార్టీ పెద్దలకు తమ వాదన వినిపించారు. ఈ అంశాన్ని పార్టీ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజా నిజాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తోందట. నియోజకవర్గంపై పట్టుసాధించే క్రమంలోనే వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటుందనే అభిప్రాయంలో పార్టీ పెద్దలు ఉన్నారట. అయితే ఒక్కోవర్గం వెనక పార్టీ నేతల బలమైన మద్దతు ఉండటంతో ఎవరిపై చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. అసలు చర్యలు తీసుకుంటారో లేదో కూడా చెప్పలేకపోతున్నారట. మరి.. ఇలాగే ఉపేక్షిస్తే శేరిలింగంపల్లి బీజేపీలో ఇంకెన్ని సిత్రాలు బయటపడతాయో చూడాలి.
తాజావార్తలు
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!