YCP : సవాల్ విసిరి పుష్ప శ్రీవాణి భయపడి పారిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రండి నడిరోడ్డుపై తేల్చుకుందామని సవాళ్లు చేసుకున్నారు. సడెన్గా ఒకరు డ్రాప్ అయ్యారు. రెండోవాళ్లకు అది అస్త్రంగా మారిపోయింది. మధ్యలో మరో లేడీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. మన్యంలో సవాళ్ల సిగపట్లపై హాట్ హాట్గా చర్చించుకుంటున్నారట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం. గిరిజన ప్రాంతమైనా ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాటే. కురుపాం ఎమ్మెల్యే.. మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిపై తాజాగా స్థానిక టీడీపీ నేతలు సవాల్ విసిరారు. 500కోట్లకుపైనే అక్రమాస్తులు సంపాదించారన్నది టీడీపీ ఆరోపణ. దీనికి గట్టిగానే బదులిచ్చారు పుష్పశ్రీవాణి. ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారమె. ఈ నెల 11నే చర్చకు సిద్ధమని చెప్పడంతో దానికి టీడీపీ నేతలు ఓకే చెప్పారు. కానీ.. ఆరోజున పుష్పశ్రీవాణి రాకపోవడంతో టీడీపీ నేతలు విమర్శలకు పదును పెట్టారు. ఆమెకు సొంత వదిన అయిన శత్రుచర్ల పల్లవిరాజు ఈ ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Also Read
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Off The Record: రొటీన్కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
గుంటూరులో వైసీపీ ప్లీనరీకి వెళ్లడంతో చర్చకు రాలేనని పుష్పశ్రీవాణి ఒక ప్రకటన విడుదల చేశారు. దాంతో చర్చ వాయిదా పడింది. అయితే సమస్య మాత్రం సెగలు రేపుతూనే ఉంది. పూర్తి ఆధారాలతో వస్తే.. భయపడి పారిపోయారని పల్లవిరాజు ఎదురుదాడి చేయడం కురుపాం రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టైమ్, డేటు పుష్పశ్రీవాణే ఫిక్స్ చేసి.. ఇప్పుడు సాకులు వెతకడం.. అతికినట్టు లేదని విమర్శల డోస్ పెంచేశారు. నిజంగా చర్చ చేయాలని ఉంటే విమానంలో రాలేరా అనేది టీడీపీ ప్రశ్న.
ఈ గొడవ వెనక పెద్ద రాజకీయమే ఉందట. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రెండు పార్టీలు జనాల అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన జనార్దన్ థాట్రాజు చనిపోయారు. ఆయన తర్వాత శత్రుచర్ల విజయరామరాజు అనుచరురాలైన జగదీశ్వరి కురుపాం టీడీపీ ఇంఛార్జ్గా ఉన్నారు. ఇక్కడ టీడీపీ సీటు ఖాళీగా ఉందని భావించారో ఏమో.. పల్లవి రాజు అడ్వాన్స్ అవుతున్నారు. టీడీపీలో చేరి టికెట్ పట్టే ఆలోచనలో ఉన్నారట. శత్రుచర్ల విజయరామరాజుకు కుమార్తె వరస కూడా కావడంతో పెద్దల ఆశీసులు తప్పక లభిస్తాయని ఆమె లెక్కలేస్తున్నారట. ఇదే సమయంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పుష్పశ్రీవాణిపై స్థానికంగా వైసీపీలో అసమ్మతి పెరుగుతోంది. టికెట్ ఆశించేవాళ్లు మెల్లగా తెరపైకి వస్తున్నారు. రాష్ట్రంలో కూడా రాజకీయ వాతావరణం వేడెక్కుతుండటంతో.. జనాల్లో తమ పేరు చర్చల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు రెండు పార్టీల నేతలు. తాజా సవాళ్లు.. బహిరంగ చర్చను ఆ కోణంలోనే చూస్తున్నారట. మరి.. రానున్న రోజుల్లో ఈ సవాళ్ల సిగపట్లు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!