Telangana Politics : ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ వచ్చినట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress MLA Komatireddy Rajagopal Reddy’s political future has been clarified ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయ భవిష్యత్పై క్లారిటీ వచ్చినట్టేనా? కాంగ్రెస్ కండువా తీసేసి.. కాషాయ కండువా వేసుకోబోతున్నారా? కేడర్తో సమావేశాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తారా..లేదా? ముహూర్తం ఎప్పుడు? లెట్స్ వాచ్..!
Also Read
స్వపక్షంలో విపక్షంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగొపాల్ రెడ్డి.. గత కొన్నేళ్లుగా పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతారని టాక్. ఆ ప్రయత్నంలో భాగంగానే ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారట. కాకపోతే ఆ సమావేశాన్ని చివరి క్షణంలో ఎందుకు వాయిదా వేసుకున్నారనే చర్చ మునుగోడులో జోరందుకుంది. అనారోగ్యం వల్ల వాయిదా వేసినట్టు చెబుతున్నా.. ఇంకేదో బలమైన కారణం ఉందని అనుమానిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ను ఎప్పుడు వీడతారు? రాజకీయ భవిష్యత్పై ఎప్పుడు స్పష్టత ఇస్తారో అనే ఉత్కంఠ మళ్లీ పెరిగింది.
గతంలో పలుమార్లు బీజేపీకి అనుకూలంగా ప్రకటన చేసినా.. ధైర్యంగా అడుగు వేసింది లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినా.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నదీ లేదు. రాహుల్ గాంధీ పర్యటనకు.. మీటింగ్కు దూరంగా ఉన్నారు. దాంతో రాజగోపాల్రెడ్డి జంప్ చేయడానికే నిర్ణయించుకున్నారని చర్చ సాగుతోంది. ఇంతలో మునుగోడులో జరిగిన ఒక కార్యక్రమంలో తాను కాంగ్రెస్ను వీడేది లేదని చెప్పి ఆశ్చర్యపరిచారు రాజగోపాల్రెడ్డి. ఆయన మనసు మార్చుకున్నారని అనుకున్నంతలోనే.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షాతో రాజగోపాల్రెడ్డి సమావేశం అయ్యారని.. ప్రచారం గుప్పుమంది. ఆ తర్వాతే మునుగోడులో ముఖ్య కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేయడంతో ఏదో కీలక ప్రకటన ఉంటుందని అనుకున్నారు. బీజేపీలో ఎప్పుడు చేరేదో వెల్లడిస్తారని భావించారంతా. కానీ అదేమీ జరగలేదు.
ప్రస్తుతం మునుగోడులో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. రాజగోపాల్రెడ్డి తీరుపై ఒక వర్గం కన్నెర్ర చేస్తోందట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే బీజేపీలోకి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారట. ఆ కామెంట్స్ చెవిన పడిన తర్వాత రాజగోపాల్రెడ్డి కొంత షాక్ అయ్యారట. ఆయన ఏర్పాటు చేసే సమావేశానికి వెళ్లి ఇదే అంశంపై నిలదీయాలని చూశారట. దాంతో సమావేశం రచ్చ రచ్చ అవుతుందని సందేహించి.. హడావిడిగా మీటింగ్ను రద్దు చేశారని అభిప్రాయ పడుతున్నారు. గతంలో రాజీనామాపై రాజగోపాల్రెడ్డి చేసిన ప్రకటనను ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే ఉపఎన్నికలు జరిగితే అన్నీ నియోజకవర్గాలు హుజురాబాద్లా ఉండబోవని.. కాంగ్రెస్ కేడర్ సవాల్ చేస్తోందట.
మునుగోడులో రాజగోపాల్రెడ్డి బీజేపీ తరఫున బరిలో ఉంటే.. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారా అనేది కొందరి ప్రశ్న. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ జీవితం ఎవరిది వారిదే అయినప్పటికీ.. కాంగ్రెస్ కేడర్ మాత్రం వారిని వేర్వేరుగా చూడటం లేదట. రాజగోపాల్రెడ్డి తీసుకునే నిర్ణయం.. వెంకటరెడ్డిపై కూడా పడుతుందని అభిప్రాయ పడుతున్నారు. వన్స్ రాజగోపాల్రెడ్డి జంప్ అయితే.. ఆయనపై కత్తులు దూసేందుకు కాంగ్రెస్ కీలక నేతలు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. మరి.. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తారో.. ఎప్పుడు కండువా మారుస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!