Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?
- చోడవరంలో మూడుసార్లు గెలిచిన KSNSN రాజు
- ఈసారి గెలిచాక ఎమ్మెల్యే వైఖరి మారిందని పార్టీ టాక్
- వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యం అంటూ తమ్ముళ్ళ ఆవేదన
- ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆధిపత్య పోరు
- అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబుతో విభేదాలు
- 2024లో తాతయ్య బాబుకు టిక్కెట్ గ్యారంటీ అన్న ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ సీనియర్ ఎమ్మెల్యే అయినోళ్ళకు ఆకుల్లోనూ, కాని వాళ్ళకు కంచాల్లోనూ వడ్డిస్తున్నారా….? జెండా మోసింది మేమైతే….. జమా ఖర్చులు చూసేది వేరావాళ్ళా అంటూ పాత టీడీపీ సీనియర్స్ కారాలు మిరియాలు నూరేస్తున్నారా…?. ఈ లెక్కల తేడాలే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టీడీపీ ప్రెసిడెంట్కు మధ్య మంట పెట్టాయా? టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ ఎక్కడ నడుస్తోంది? కొత్త కుంపట్లతో లాభ నష్టాల సంగతేంటి?
అనకాపల్లి జిల్లా చోడవరం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ అభ్యర్ధుల కంటే పార్టీ జెండాకే జై కొడతారు. 2009,2014,2024లో ఇక్కడి నుంచి గెలిచారు పార్టీ సీనియర్ నేత KSNSN రాజు. వైరి వర్గాలతో కూడా సౌమ్యంగా ఉంటారని పేరున్న ఎమ్మెల్యే….ఈ దఫా పొలిటికల్ స్ట్రాటజీని మార్చడం అంతర్గతంగా అగ్గి రాజేస్తోందట. కూటమి పార్టీలను సమన్వయం చేసుకోవడం కంటే సంస్ధాగతంగా బలమైన శక్తిగా ఎదిగేందుకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన కలిసి ఐదేళ్ళపాటు పోరాడినా… ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు ఎమ్మెల్యే ఆశ్రయం కల్పించడమే కాకుండా తమ మీద ఆజమాయిషీ చేసే స్ధాయికి తెచ్చారనే ఆవేదన ఎక్కువవుతోంది. ఈ క్రమంలో నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కుతుండగా ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారాలు మారుతున్నాయని అంటున్నారు.
Also Read
ఎమ్మెల్యే పెద్దరికం ప్రదర్శిస్తున్నా… ఆయన వర్గం మాత్రం మిగిలిన వాళ్ళతో ఓ ఆట ఆడేస్తోందనే ఫిర్యాదు లు హైకమాండ్కు వెళ్తున్నాయట. దీంతో చోడవరం టీడీపీ గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు., ఎమ్మెల్యే వర్గం మధ్య విభేదాలు ఇటీవల మరోసారి బహిర్గతం అయ్యాయి. వడ్డాది గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం దగ్గర తలెత్తిన మాట పట్టింపులు పోలీసులు మోహరింపు వరకు వెళ్ళింది. అక్కడితో ఆగకుండా ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా కనిపించిన కేఎస్ఎన్ ఎస్ రాజు…..అనూహ్యంగా రేసులోకి వచ్చారు. దీంతో సీటు గ్యారెంటీ అని భావించి ప్రచారానికి సిద్ధమైన తాతయ్య బాబుకు షాక్ తప్పలేదు. బలమైన కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉన్న ఈ స్ధానంలో టీడీపీకి జనసేన ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ అయింది. బలమైన కూటమి గాలిలో రాజు విజయం సాధించగా…. తాతయ్య బాబుకు పార్టీ జిల్లా ప్రెసిడెంట్తో పాటు కీలకమైన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది.
మొదట్లో అంతా సవ్యంగా కనిపించినప్పటికీ… మెల్లిగా ఆధిపత్య పోరు మొదలైంది. ఇలాంటి పరిస్ధితులు జనసేన ఎమ్మెల్యేలు గెలిచి….టీడీపీలో సీనియర్స్ వున్న దగ్గర కనిపిస్తుండగా….. చోడవరంలో మాత్రం సైకిల్ వెర్సస్ సైకిల్ అన్నట్టుగా మారింది. కొద్దిరోజుల క్రితం పెద్ద మదీనా గ్రామంలో జనసేన, టీడీపీ వర్గాలు యుద్ధ వాతావరణం స్రుష్టించాయి. కొండపోరంబోకులో వున్న చెట్ల వేలం దగ్గర ఎమ్మెల్యే వర్గం….జనసేన వర్గం తన్నుకున్నాయి. ఇప్పుడు సిమెంట్ రోడ్డు దగ్గర మొదలైన ప్రోటోకాల్ పంచాయితీ పెద్దదైంది.
సుమారు 55 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం ఎమ్మెల్యే వర్గీయులు చేపట్టారు. తన స్వగ్రామంలో జరుగుతున్న అభివ్రుద్ధి పనులకు ఆహ్వానం లేకపోవడంతో జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు కినుక వహించారు. ఆయన అనుచరులు వెళ్ళి పనుల్ని అడ్డుకున్నారు. ఇది ముమ్మాటికీ జిల్లా అధ్యక్షుడికి జరిగిన అవమానమేనని….ఎమ్మెల్యే సమాధానం చె ప్పాలని ఆయన వర్గం అలిగి కూర్చుంది. మరోవైపు ఈ లెక్కన చూ స్తే…. జిల్లా అధ్యక్షుడు అభివృద్ధికి ఆటంకంగానే భావించాల్సి వుంటుందంటూ ఎమ్మెల్యే వర్గీయులు ప్రచారం చేయడంతో వ్యవహారం ముదిరి పాకానపడింది. అయితే…. ఎమ్మెల్యే వెర్సస్ జిల్లా ప్రెసిడెంట్ ఫైటింగ్ కొ త్త కాదని, గతంలో ఏకంగా కటౌట్లు వేసుకునే వరకూ విభేదాలు వెళ్ళాయంటూ గుర్తు చేసుకుంటున్నాయి చోడవరం టీడీపీ వర్గాలు. మరోవైపు ఎమ్మెల్యే ఇటీవల అనుసరిస్తున్న విధానాల కారణంగానే సమస్యల జటిలమవుతోందంటూ ప్రచారాన్ని విస్త్రుతం చేసింది టీడీపీలోని మరో వర్గం.
నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా వున్న వాళ్ళకే నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు దక్కుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఇటీవల జిల్లా అధ్యక్షుడు కూడా పావులు కదుపుతున్నారట. KSNSN ఎంపిక చేసిన నలుగురు మండల అధ్యక్షుల నియమాకాన్ని జిల్లా అధ్యక్షుడి హోదాలో తాతయ్య బాబు పక్కన బెట్టేయడంలో సక్సెస్ అయ్యారు. పోటీగా ఎమ్మెల్యేవ్యూహం పన్ని పరువు నిలబెట్టుకున్నా…..ఆధిపత్యం అసలు సమస్యగా మారిందనేది బహిరం గంగానే కనిపిస్తోంది. అటు నియోజకవర్గంలో ఉన్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ ఇటీవల మూతపడింది. ప్రజలకు రహదారులు, తాగునీరు సహా అనేక సమస్యలున్నాయి. వాటన్నిటినీ గాలికొదిలేసి అధికార పార్టీలోని రెండు వర్గాలు ఇలా కుమ్ములాడుకుంటుంటే…భవిష్యత్ పరిణామాలు వేరేలా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది టీడీపీ కేడర్.
తాజావార్తలు
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!