OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
- సీఎం ప్రెస్మీట్లో NDSA ఛైర్మన్ ఉండటంపై అభ్యంతరాలు
- రాజకీయ వ్యాఖ్యలు చేసేచోట కేంద్ర అధికారికి ఏం పని అంటూ ఫైర్
- సీఎం కాళేశ్వరం టూర్లో NDSA ఛైర్మన్ అనిల్ జైన్
- ప్రెస్మీట్లో బీజేపీని కూడా టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి
- అనిల్ జైన్ వైఖరిపై బీజేపీ నేతల మండిపాటు
- కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి బండి సంజయ్ ఫిర్యాదు
- అనిల్ జైన్ అసలు శాఖలో చెప్పే వచ్చారా అంటూ ఆరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: NDSA ఛైర్మన్ విషయంలో ఏదో తేడా కొడుతోందా? ఆయన మీద కమలం నేతలకు కోపం ఎందుకొచ్చింది? ఏకంగా ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసే దాకా ఎందుకు వెళ్ళింది వ్యవహారం? ఈ విషయంలో నేరుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అసలేంటి ఆ డ్యామ్ గేమ్? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్పై కమలం పార్టీ కస్సుబుస్సులాడుతోందట. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాళేశ్వరం పర్యటన సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో NDSA ఛైర్మన్ పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కమలదళం.
READ ALSO: BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
పైగా… అదే టైంలో సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేయడంతో… ఛైర్మన్ తీరుపై మండిపడుతున్నారు తెలంగాణ బీజేపీ లీడర్స్. ఛైర్మన్ అనిల్ జైన్ వ్యవహారశైలిపై కేంద్ర మంత్రి బండి సంజయ్…. జలశక్తి శాక మంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరుండి వివరాలు చెప్పడం వరకు ఓకే అయినా…. ఒక కేంద్ర ప్రభుత్వ అధికారి ఏకంగా రాజకీయ వ్యాఖ్యలు చేసే ప్రెస్మీట్లో ఎలా కూర్చుంటారంటూ ప్రశ్నిస్తున్నారు బీజేపీ నాయకులు. తన టూర్లో భాగంగా కాళేశ్వరం వెళ్లారు సీఎం. మేడిగడ్డను సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారులు ఉన్నారు. అదే సమయంలో NDSA ఛైర్మన్ అనిల్ జైన్ కూడా వాళ్ళతో ఉన్నారు. సీఎం, మంత్రులతో కలిసి తిరిగారు. పనిలో పనిగా ప్రెస్ మీట్లో కూడా కూర్చోవడంపై బీజేపీ వైపు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ఆయన వైఖరిపై పూర్తి వివరాలను ఆరా తీస్తున్నారట కమలం నేతలు. అనిల్జైన్ ఇప్పటి వరకు తెలంగాణలో ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారు? వ్యవహారశైలి ఎలా ఉందంటూ…. సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.
తన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి… కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కాళేశ్వరం కేసు దర్యాప్తు కోసం సీబీఐకి లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని కూడా విమర్శించారాయన. బీజేపీని అడ్డుపెట్టుకుని అవినీతి కేసుల నుంచి బయటపడతామని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కూడా హెచ్చరించారాయన. సరిగ్గా ఇక్కడే కాషాయ నేతలకు మండుతోందట. అంటే… మేం అవినీతిపరులకు అండగా నిలబడే వాళ్ళమని అనుకుంటున్నారా అంటూ ఫైరైపోతున్నట్టు సమాచారం. ఇలాంటి సమావేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారిగా అనిల్జైన్ ఎలా పాల్గొంటారంటూ మండిపడుతున్నారు. ఇక కాళేశ్వరం విషయంలో NDSA మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని, ప్రతి విషయంలో NDSA అప్రూవల్ తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ… ఇందులో కూడా ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు బీజేపీ నాయకులు. అదేంటో త్వరలోనే బయటపడుతుందని కూడా చెబుతున్నారు.
ఆ సంగతి ఎలా ఉన్నా… కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన, నేరుగా పొలిటికల్ కామెంట్స్ చేసిన మీటింగ్లో NDSA ఛైర్మన్ ఎలా కూర్చున్నారంటూ… ఆగ్రహంగా ఉన్నారట. అదే విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్…. జలశక్తి శాఖ మంత్రి దగ్గర ప్రస్తావించినట్టు తెలిసింది. కేవలం మాటతో సరిపెట్టకుండా…. ఫిర్యాదు చేసి… రాష్ట్రంలో జరిగిన వ్యవహారాలన్నిటినీ వివరంగా చెప్పారట. ఇదే సమయంలో అనిల్జైన్కు సంబంధించిన రకరకాల అంశాలు తెర మీదికి వస్తున్నాయి. ఆయన మీద గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయంటూ వాటిని వివరాలు సేకరిస్తున్నారు బీజేపీ నాయకులు. అసలు ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి టూర్కు ఆయన తన మంత్రివర్గ శాఖలో చెప్పి అనుమతి తీసుకుని వచ్చారా? లేక సొంత పెత్తనాలు చేస్తున్నారా అంటూ కూపీ లాగుతున్నారు కమలం లీడర్స్.
READ ALSO: Rice Vadiyalu: అన్నం మిగిలిపోతే అస్సలు పడేయకండి.. ఇలా చేస్తే అదిరిపోయే రైస్ పాపడ్స్ రెడీ అవుతాయ్!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!