Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Bjp Leaders Calm On Key Issues In Telangana

ఉలుకు పలుకు లేని ఆ ముగ్గురు!

Published Date :January 10, 2022 , 7:45 pm
By NTV WebDesk
ఉలుకు పలుకు లేని ఆ ముగ్గురు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ ముగ్గురు బీజేపీ నేతలు ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. అంతా ఒకే సామాజికవర్గం నేతలు కావడంతో పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయట. ఒకవైపు బీజేపీ దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. పత్తా లేకుండా పోయిన వారి గురించి నిఘావర్గాలు ఆరా తీశాయట. ఇంతకీ ఎవరా నాయకులు?

పార్టీ ఆఫీస్‌కూ రావడం లేదని ఆరా..?
తెలంగాణలో బీజేపీ నాయకులు వరసగా ఆందోళనలు నిర్వహిస్తూ రోడ్లపైనే ఉంటున్నారు. జాగరణ దీక్ష చేపట్టిన పార్టీ చీఫ్‌ బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడంతో పార్టీలో యాక్టివిటీస్‌ ఇంకా పెరిగాయి. బీజేపీ ఆఫీస్‌కు ముఖ్య నాయకుల తాడికి ఎక్కువైంది. ఇంత సందడిలోనూ కొందరు బీజేపీ సీనియర్ నాయకులు పార్టీ ఆఫీస్‌లో కనిపించడం లేదట. గతంలో పార్టీ కార్యాలయాన్నే అంటిపెట్టుకుని ఉన్న ఆ నాయకులు ఎందుకు రావడం లేదని కమలనాథులు ఆరా తీస్తున్నారట.

మధ్యప్రదేశ్‌ సీఎం వచ్చినా పత్తా లేని మురళీధర్‌రావు
ఆ ముగ్గురు ఎవరో కాదు. ఒకప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. సంఘ్‌ పరివార్‌ క్షేత్రాల్లో కీలకంగా ఉన్న మురళీధర్‌రావు ఆ ముగ్గురిలో ఒకరు. మురళీధర్‌రావు ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ బీజేపీ ఇంఛార్జ్‌. బండి సంజయ్‌ అరెస్ట్‌పై ఒక ట్వీట్‌ చేశారు తప్ప ఉలుకు పలుకు లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తే ఆయన కనిపించలేదు. చివరకు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వచ్చినా.. పత్తా లేరు. దీంతో మురళీధర్‌రావు ఎక్కడా అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. కాషాయ శిబిరంలో గుసగుసలు పెరిగాయి. వ్యక్తిగత పనులు, ఆరోగ్య కారణాల వల్ల అందుబాటులో లేరని పార్టీలో కొందరు చెబుతున్నా.. మిగతా వాళ్లకు ఆ సమాధానం అంతగా ఎక్కడం లేదట. దాల్‌ మే కుచ్‌ కాలా హై అన్నది వారి అనుమానం.

లింగోజీగూడ ఎపిసోడ్‌తో సంజయ్‌తో శేఖర్‌రావుకు గ్యాప్‌..!
మరో నాయకుడు పేరాల శేఖర్‌రావు గురించి కూడా బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఖాదీ గ్రామీణ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు శేఖర్‌. బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు. మొన్నటి వరకు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్‌ నుంచి పోటీ చేశారు కూడా. ఏబీవీపీ, బీజేపీలో కొన్నేళ్లు పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసిన శేఖర్‌.. ఈ మధ్య పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. GHMC పరిధిలోని లింగోజీగూడ డివిజన్‌ ఉపఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలు పార్టీలో దుమారం రేపాయి. ఆ తర్వాత పార్టీ చీఫ్‌ బండి సంజయ్‌తో శేఖర్‌కు గ్యాప్‌ వచ్చిందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ దూకుడుగా వెళ్తున్న టైమ్‌లో శేఖర్‌ కనిపించడం లేదన్నది బీజేపీ వర్గాల మాట.

సంజయ్‌ అరెస్ట్‌పై స్పందన లేని కృష్ణసాగర్‌రావు..?
మూడో నాయకుడు.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు. తెలంగాణలో ఏం జరిగినా స్పందించి మీడియాలో కనిపించే ఆయన.. ప్రస్తుతం చప్పుడు చేయడం లేదు. పార్టీ కార్యాలయానికి రెగ్యులర్‌గా వచ్చేవారు. ప్రస్తుతం అదీ బంద్‌. మీడియాతో ముచ్చట్లు లేవు.. ముఖ్య నేతలు వస్తే మాటలు కలపడం లేదు. బండి సంజయ్‌ అరెస్ట్‌ అంశంలోనూ స్పందించలేదని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.

ముగ్గురు నేతల మౌనంపై పార్టీలోనే సందేహాలు..!
మురళీధర్‌రావు, శేఖర్‌రావు, కృష్ణసాగర్‌రావు ముగ్గురూ ఒకే సామాజికవర్గం. ఎందుకు సైలెంట్‌ అయ్యారన్నదానిపై కాషాయ శిబిరంలోనే అనేక సందేహాలు ఉన్నాయట. ఇదే సమయంలో రాష్ట్ర నిఘా వర్గాలు కూడా వీరి గురించి ఆరా తీస్తున్నారని బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. మరి.. ఈ మౌనానికి అసలు కారణం ఏంటో ఆ ముగ్గురు పార్టీ పెద్దలకైనా చెబుతారో లేదో..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp telangana
  • bjp telangana leaders
  • krishna sagar rao
  • modi

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions