అప్పులకోసం ఏపీ ప్రభుత్వం కసరత్తు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం నుంచి నిధులను రప్పించాలి.. పెండింగ్ నిధుల కోసం సెంటర్పై ఒత్తిడి తేవాలి. ఇలాంటి ఆలోచనలకు ఏపీలో కాలం చెల్లిందా? నిధుల వేట పక్కన పెట్టి.. అప్పుల వేటకే ప్రాధాన్యం ఇస్తున్నారా? ఏపీ ఆర్థిక పరిస్థితి.. జరుగుతున్న పరిణామాలపై ఏపీ సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
నిధుల సమీకరణ.. ఆదాయం పెంచుకునే మార్గాలేవి?
Also Read
ఏపీ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. అప్పులు.. పెండింగ్ బిల్లులు.. పెరగని ఆదాయం.. ఇవి చాలవన్నట్టు కరోనా కష్టకాలంలో ఎక్కువైన ఖర్చులు.. సంక్షేమానికి లెక్కకు మిక్కిలిగా నిధుల గుమ్మరింపు.. వెరసి ఏపీ ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగి తేలుతుందనే చెప్పాలి. నిధుల సమీకరణ మాట పక్కన పెట్టి.. ఆదాయం పెంచుకునే మార్గాలు వదిలి పెట్టి.. అప్పులు ఏ విధంగా తీసుకురావాలి? దానికోసం ఎలాంటి కసరత్తు చేయాలి? అవలంభించాల్సిన పద్ధతులేంటి? ఎవరెవర్ని నియమించుకోవాలి? అనే విషయాలపైనే ఎక్కువ ఫోకస్ కనిపిస్తోందని సచివాలయ వర్గాల చర్చ.
భవిష్యత్ ఎలా అన్నది సచివాలయ వర్గాల ప్రశ్న
ఖర్చు పెడుతున్న ప్రతి పైసాకీ లెక్కలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే చెబుతోంది. విమర్శలను లైట్ తీసుకుంటోంది. అయితే కౌంటరుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విడుదల చేసిన ప్రకటనపై సచివాలయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక లక్షా 27వేల కోట్ల మేర అప్పులు తెస్తే.. వాటిల్లో ఒక లక్షా ఐదు వేల కోట్లను ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల రూపంలో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. వస్తున్న ఆదాయాన్ని రోజువారీ ఖర్చులు.. ఉద్యోగుల జీత భత్యాల కోసం వినియోగిస్తూ.. తెచ్చిన అప్పులను సంక్షేమ పథకాల కోసమే వినియోగిస్తోందా? అనే చర్చ జరుగుతోంది. ఇదే వాస్తవమైతే భవిష్యత్ ఎలా అన్నది సచివాలయ వర్గాల ప్రశ్న.
కేంద్రం నుంచి వచ్చే నిధులపై గతంలో ఫోకస్?
ఇదే సందర్భంలో మరో అంశంపైనా చర్చ మొదలైంది. గతంలో కేంద్రం నుంచి ఏయే పథకాల రూపంలో నిధులు తీసుకురావాలి..? ఎంత మేర నిధులను రాబట్టుకోవాలి..? గ్రాంట్లను ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి..? అలాగే పెండింగ్ నిధుల విడుదలకు కేంద్రంపై ఎలా ఒత్తిడి తేవాలనే అంశంపై దృష్టి పెట్టేవారు. ఇప్పుడు కూడా ఆ ఆలోచన చేస్తున్నా.. అది పెద్దగా ఎలివేట్ కావడం లేదు. కానీ.. అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే హైలైట్ అవుతున్నాయి. ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు.. సలహాదారుల నియామకాలపై చర్చల డోస్ పెరుగుతోంది. చివరకు రాష్ట్రానికి అప్పులు తేవడమే ప్రయారిటీగా మారిందనే అభిప్రాయం జనాల్లోకి వెళ్తోంది.
అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకంపై చర్చ!
రాష్ట్రం అదనంగా పది వేల 500 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం ఓకే చెప్పగానే.. అదే పెద్ద వెసులుబాటుగా ఆర్థికశాఖ వర్గాలు ఫీలవుతున్నాయట. ఈ అంశాన్నే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు.
అయితే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మధ్య సమతూకం పాటిస్తే ఆర్థిక ఇక్కట్ల నుంచి బయటపడొచ్చని.. పరిస్థితిని అదుపులోకి తేవచ్చన్నది నిపుణుల మాట. మరి.. ఆర్థిక అంశాల చుట్టూ జరుగుతున్న ప్రచారం నుంచి సర్కార్ ఏ విధంగా బయట పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!