Anumula Revanth Reddy :రేవంత్ రెడ్డి అనుకున్నదొకటి అయినదొకటి!
Anumula Revanth Reddy Congress TPCC :
ఆయన అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా? సొంత టీమ్ను సిద్ధం చేసుకోవాలని ఉబలాట పడ్డారా? అందుకు సొంత పార్టీ వాళ్లే కత్తెర వేస్తున్నారా? ఎవరికి వారే.. అది మా అడ్డా అని చెక్ పెడుతున్నారా? ఇంతకీ ఏంటా పార్టీ? సొంత టీమ్ ఆశించింది ఎవరు? అడ్డుకుంటోంది ఎవరు? లెట్స్ వాచ్..!
తెలంగాణ కాంగ్రెస్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది గడుస్తున్నా… డీసీసీలను కూడా నియమించుకోలేకపోయారు రేవంత్రెడ్డి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. కొత్త టీమ్ను తెచ్చుకోవాలని.. ఆయన భావించారు. జిల్లా కాంగ్రెస్ సారథుల్లో దాదాపు 18 చోట్ల కొత్త చీఫ్ను తీసుకురావాలని తలపోశారట. ఈ విషయంలో రేవంత్ అనుకున్నదొక్కటీ.. అయ్యిదొక్కటీ అన్నట్టుగా ఉందట. జిల్లాల వారీగా కాంగ్రెస్ నేతలు తమ ప్రాంతాల్లో డీసీసీ నియామకాలపై ఆశావహుల పేర్లు సూచిస్తున్నారు. దీంతో తన అని అనుకున్నవాళ్లను డీసీసీలను చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారట పీసీసీ చీఫ్. జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది డీసీసీ నియామకాలపై ఫోకస్ పెట్టడంతో ఏం పాలుపోవడం లేదట.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
పీసీసీగా వచ్చిన కొత్తలో DCCలపై సీరియస్గా దృష్టిపెట్టిన రేవంత్రెడ్డి.. ప్రస్తుతం చేతులు ఎత్తేసినట్టు సమాచారం. AICC నుంచి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయాలని పీసీసీకి ఆదేశాలు ఇచ్చారట. అయితే ఆ అంశాన్ని పక్కన పెట్టి.. ముందు DCCల నియామకాన్ని క్లియర్ చేయాలని కోరారట రేవంత్. దీని గురించి తెలిసిన వెంటనే.. నల్గొండ, కరీంనగర్.. మెదక్.. మహబూబ్ నగర్.. ఖమ్మం జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతలు… జిల్లా కాంగ్రెస్ సారథులుగా తమ వారే ఉండాలని ఒత్తిళ్లు పెంచుతున్నారట. వచ్చేది ఎన్నికల కాలం కావడంతో నాయకులు డీసీసీలపై ఉడుంపట్టు పట్టినట్టు తెలుస్తోంది. దీంతో పీసీసీకి స్పేస్ లేకుండా పోయిందట.
ఈ గొడవలు చూశాక.. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న డీసీసీల నియామకం వరకే రేవంత్రెడ్డి పరిమితం అయ్యారు. మేడ్చల్ జిల్లాకు కంటి శ్రీధర్ పేరు ప్రకటించారు. రంగారెరడ్డి జిల్లాకు సంబంధించి.. రేవంత్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయట. AICC కూడా జిల్లా నాయకత్వం నిర్ణయానికే వదిలేయడంతో.. తన అభిప్రాయం చెప్పడానికి కూడా రేవంత్ సాహసించలేదని చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లా నేతలు సూచించిన పేర్లపై కార్యకర్తలు, పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఫైనల్ చేస్తున్నారట. పార్టీ వ్యూహకర్త సునీల్ మాత్రం తన టీమ్తో అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు సమాచారం.
డీసీసీల విషయంలో తలబొప్పి కట్టడంతో రేవంత్రెడ్డి వ్యూహం మార్చేశారట. తన పరిధిలోని పీసీసీ కార్యవర్గం నియామకంపైనే ఎక్కువ నజర్ పెట్టారట. ప్రధాన కార్యదర్శి పదవులనే వందకు పైగా ఇవ్వాలని చూస్తున్నారట. వీళ్లకే నియోజకవర్గ బాధ్యతలు అప్పటించే ఆలోచనలో కాంగ్రెస్ ఉందట. మరి.. ఇందులోనైనా రేవంత్ మాట నెగ్గించుకోగలరా? లేక ఒత్తిళ్లు.. నేతలు వేసే కత్తెరలకు గగ్గోలు పెడతరా చూడాలి.
తాజావార్తలు
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
-
Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
-
Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
-
West Bengal elections: బెంగాల్లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
-
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!