Site icon NTV Telugu

AP Crime: మదనపల్లెలో దారుణం.. వైసీపీ నేత దారుణ హత్య

Ap Crime

Ap Crime

AP Crime: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణం శ్రీవారినగర్‌లో వైసీపీ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యారు. శేషాద్రి ఇంట్లోకి దూరిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దాంతో ఆయన రక్తపుమడుగులో కుప్పకూలారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. దుండగులు పరారీ కాగా.. వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Fire Accident : ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం.. ఆరుగురికి గాయాలు

Exit mobile version