సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఛాతీ లో ఉన్నది గుండెనా? బండ నా? అంటూ తీవ్ర స్థాయి లో వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. గజ్వేల్ లో నిరుద్యోగ నిరాహారదీక్ష అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు నామినేషన్లు వేయాలని… వారికి అన్ని విధాలుగా తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఏడేళ్లుగా కేసీఆర్ గజ్వేల్ కి ఏమి చేశాడని మండిపడ్డారు.
తాలిబన్ల చేతి లో ఆప్ఘనిస్తాన్ ప్రజలు చిక్కుకున్నట్లు కల్వకుంట్ల కుటుంబము లో తెలంగాణ ప్రజలు చిక్కుకున్నారని నిప్పులు చెరిగారు. ఎన్నికలు తర్వాత కేసీఆర్ గజిని అయిపోతారని.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత దళితులు మీద 800 శాతం దాడులు పెరిగాయన్నారు. 37 లక్షలు మంది రైతులు కి వాగ్దానం చేసి మూడు లక్షలు మందికి మాత్రమే రుణ మాపీ చేశారని… 54 లక్షలు మంది నిరుద్యోగులు జాబ్ లు కోసం ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు నిరుద్యోగులందరూ బద్ది చెప్పాలని పేర్కొన్నారు వైఎస్ షర్మిల.