YS Jagan on EVMs: ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. బ్యాలెట్ విధానమే ముద్దు..!
- ఈవీఎంల వాడకంపై వైఎస్ జగన్ కీలక ట్వీట్
- న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలి
- ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలి
- ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో.. దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు
- ఈవీఎంలను ఉపయోగించడం లేదు. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan on EVMs: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి ఈవీఎంలపై రకరకాల ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈవీఎంల వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈవీఎంల విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ సీఎం.. ”న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలి. అలాగే ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో.. దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. ఈవీఎంలను ఉపయోగించడం లేదు. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలి.. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్..
Read Also: Priyanka Gandhi : వయనాడ్ నుంచి ప్రియాంక రెడీ.. పోటీపై సీపీఐ నేత అన్నీ రాజా ఏమన్నారంటే?
Also Read
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
కాగా, గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగరవేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చతికిలపడిపోయింది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించగా.. వైనాట్ 175 అంటూ ఎన్నికల్లో వెళ్లిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయిన విషయం విదితమే. అయితే, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో బీజేపీకి సీట్లు దక్కినా.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా.. ఈవీఎంలపై విపక్షాల నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.. ఈ తరుణంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly.
In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 18, 2024
తాజావార్తలు
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!