NTV Telugu Site icon

YS Jagan Pulivendula Visit: నేడు పులివెందులకు వైఎస్ జగన్.. ఎన్నికల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి..

Jagan

Jagan

YS Jagan Pulivendula Visit: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లనున్నాఉ.. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లడం ఇదే తొలిసారి.. ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు పయనం అవుతారు. ఇక, ఐదు రోజులపాటు పులివెందులలోనే మకాం వేయనున్నారు వైఎస్‌ జగన్. సోమవారం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకుంటారు వైఎస్ జగన్‌.. భవిష్యత్ కార్యాచరణ పైన పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు..

Read Also: Prabhas : ప్రిపేర్ అయి వచ్చా.. ఈ సారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో నేడు స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇప్పటికే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. అయితే, స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్తున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఉండబోతున్నారు. కాగా, ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి పులివెందుల నియోజవర్గానికి వైఎస్ జగన్‌ వస్తుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. సీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. రోజుకో నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్‌ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అధైర్య పడకండి అండగా ఉంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా, ప్రజల్లోనే ఉండేందుకు వైఎస్ జగన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఏం చేయాలన్న దానిపై ముఖ్య నేతలతో ఐదు రోజులపాటు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.