YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని భావోద్వేగంతో స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (X) వేదికగా ఓ ప్రత్యేక పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న” అంటూ వైఎస్సార్ ఫోటోను జత చేశారు.
Read Also: Yanamala Rama Krishnudu: గతంలో నిద్రపోయారా..? సోకాల్డ్ సంపాదకులపై యనమల ఫైర్..!
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదివరకు ఓ సారి తన తండ్రి చారిత్రాత్మకమైన పాదయాత్ర ముగిసిన రోజును కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికే కాదు, రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపి, సంక్షేమానికి బాటలు వేసిన మహానేతగా వైఎస్ను జగన్ మరోసారి జ్ఞాపకం చేసుకున్నారు. జగన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సైతం పంచుకుంటూ, వైఎస్సార్ సేవలను స్మరించుకుంటున్నారు.
Read Also: Buggana Rajendranath: ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం.. మాజీ మంత్రి ఫైర్..!
You have always been my inspiration, aspiration and role model. నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.
Happy Father’s Day!Remembering the closing Day of your historic Padayatra! pic.twitter.com/Xn8qqadyKm
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2025
