Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Youtuber Manish Kashyap Who Was Arrested For Fake Video Joins Bjp

BJP: బీజేపీ గూటికి చేరిన బీహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్

Published Date :April 25, 2024 , 9:39 pm
By Suresh Maddala
BJP: బీజేపీ గూటికి చేరిన బీహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ బీజేపీలో చేరారు. ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమానికి ఆయన తల్లి కూడా హాజరయ్యారు. మనీష్ కశ్యప్.. తరచుగా ప్రధాని మోడీకి మద్దతుగా వీడియోలు చేస్తుంటారు. ఇతనికి 80 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. బీహార్ నుంచి వలస వచ్చిన వారిపై తమిళనాడులో వేధింపులకు గురవుతున్నట్లు నకిలీ వీడియోలను ప్రసారం చేసినందుకు గత ఏడాది అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసేందుకే బీజేపీలో చేరానని, తొమ్మిది నెలలు జైల్లో ఉన్నప్పుడు తన కోసం పోరాడిన తన తల్లి.. బీజేపీలో చేరాల్సిందిగా కోరిందని విలేకరులతో అన్నారు.

బీజేపీలో చేరిన అనంతరం మనీష్ కశ్యప్ అనేక విషయాలు మాట్లాడారు.. మనోజ్ తీవారి వల్లే తాను జైలు నుంచి బయటకు రాగలిగానని తెలిపారు. ప్రధాని మోడీకి తన తల్లి పెద్ద అభిమాని అని చెప్పారు. ఆ క్రమంలో ఆమె సలహా మేరకు తాను బీజేపీలో చేరినట్లు మనీష్ కశ్యప్ వివరించారు. బిహార్‌లో బీజేపీ బలపడేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అయితే బిహార్‌ రాష్ట్రాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం దోచేసిందని ఆరోపించారు. ఆ కుటుంబం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని మండిపడ్డారు. బిహార్‌లోని కొన్ని రాజకీయ పార్టీల్లో చేరాలంటే మాత్రం సూట్ కేసులతో నగదు తీసుకు వెళ్లాల్సి ఉందని ఆరోపించారు. కానీ బీజేపీలో అలా కాదన్నారు. ఈ పార్టీ పేద కుటుంబానికి చెందిన తన లాంటి వారిని సైతం గౌరవం ఇస్తుందన్నారు.

Also Read

  • Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్‌పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
  • Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
  • Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
  • AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీలో జాతీయ భావంతో తాను పని చేస్తానని స్పష్టం చేశారు. అయితే తాను జైల్లో ఉన్న సమయంలో పలు పార్టీలు తనపై ఆరోపణలు గుప్పించాయని చెప్పారు ఆ సమయంలో తనకు బీజేపీ నాయకులు ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదన్నారు. ఈ రోజు సురక్షితంగా జైలు నుంచి బయటకు వచ్చానంటే.. అందుకు తన తల్లి ఆశీర్వాదంతో పాటు బీజేపీ నాయకుల మద్దతు కూడా ఉందన్నారు.

తమిళనాడులో బిహార్‌ నుంచి వలస వచ్చిన వారిపై స్థానికులు దాడులు చేస్తున్నట్లు మనీష్ కశ్యప్ ఓ నకిలీ వీడియోని సృష్టించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో 2023, మార్చిలో మనీష్ కశ్యప్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. తమిళనాడుకు తరలించారు. దీంతో కొన్ని నెలలపాటు మధురై జైల్లో ఉన్నారు. అనంతరం అతడిని బీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత 2023, డిసెంబర్‌లో మనీష్ కశ్యప్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే అతడి వీడియోలతో.. అటు తమిళనాడు, ఇటు బీహార్‌లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ స్పందించారు. ఇటువంటి పుకార్లను నమ్మవద్దంటూ.. బీహారీలకు సూచించారు. బీహార్‌కు చెందిన మనీష్ కశ్యప్.. ప్రముఖ యూట్యూబర్. మనీష్ కశ్యప్ సన్ ఆఫ్ బీహార్ పేరు మీద ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఈ యూట్యూబ్ చానెల్ ప్రజలను ఆకట్టుకుంది. అతడి వీడియో చానెల్‌‌కు 8.75 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • arrested
  • bjp
  • fake video
  • Lok Sabha Election 2024
  • Manish Kashyap

తాజావార్తలు

  • Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్‌పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..

  • Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..

  • Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే

  • MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!

  • Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions