Youtuber Harsha Sai Instagram Post: యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలతో బ్లాక్మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే హర్ష నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా తనపై నమోదైన కేసుపై హర్షసాయి స్పందించాడు.
డబ్బులు కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఇన్స్టాగ్రామ్లో హర్షసాయి ఓ పోస్ట్ పెట్టాడు. ‘అవన్నీ తప్పుడు ఆరోపణలు. డబ్బులు దండుకోవడం కోసమే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీకు తెలుసు. నిజానిజాలు త్వరలో బయటకు వస్తాయి. మా న్యాయవాది తానికొండ చిరంజీవి ఈ విషయం గురించి త్వరలో మీ ముందుకు వస్తారు’ అని హర్షసాయి పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
Also Read: Ranji Trophy 2024: ఢిల్లీ జట్టులో కోహ్లీ, పంత్ పేర్లు.. కష్టమే సుమీ!
విశాఖకు చెందిన హర్షసాయి పేదలకు ఆర్థిక సాయం చేస్తూ.. ఆ వీడియోలు తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేస్తుంటాడు. యూట్యూబ్లో అతడికి దాదాపు 14 మిలయన్ ఫాలవోర్స్ ఉన్నారు. బెట్టింట యాప్స్ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. హర్షసాయి హీరోగా ఓ సినిమా కూడా మొదలైంది. సొంతంగా ఓ కథ రాసుకుని.. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ‘మెగా’. ఇందులో బాధిత యువతి హీరోయిన్. ఈ సినిమాకు నిర్మాత ఎవరో కాదు బిగ్ బాస్ ఫెమ్ మిత్ర శర్మ. అప్పట్లో టీజర్ కూడా విడుదలైంది. కానీ ఇంకా సినిమా రిలీజ్ కాలేదు.