Site icon NTV Telugu

Bengaluru: కూతురుతో పెళ్లి తిరస్కరించిందని.. తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంట్లో అద్దెకు దిగిన యువకుడు

Bengaluru

Bengaluru

బెంగళూరులోని బసవేశ్వరనగర్ ప్రాంతంలో షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. 28 ఏళ్ల అద్దెదారుడు ఆగ్రహానికి గురై 45 ఏళ్ల మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మహిళ తన కుమార్తెతో యువకుడి వివాహ ప్రతిపాదనను నిరాకరించడమే దీనికి కారణం. ఆ మహిళ పేరు గీత. ఆమె ఒక కిరాణా దుకాణం నడుపుతోంది. ప్రస్తుతం ఆమె విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడు టీ దుకాణం నడుపుతూ ఉండేవాడు.

Also Read:Unbreakable Cricket Records: 52 ఏళ్ల వయసులో అరంగేట్రం, 10 పరుగులకు 10 వికెట్లు.. ఈ పది రికార్డులు బద్దలు కొట్టడం అసాధ్యం!

నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గీత ఇంట్లో అద్దెకు తీసుకున్న భాగంలో ముత్తు అభిమన్యు అనే నిందితుడు టీ స్టాల్ నడిపేవాడు. ఆ స్టాల్ లో ఒకే ఒక గది, టాయిలెట్ మాత్రమే ఉండేది. గీత కూతురు (19 ఏళ్లు) బిబిఎ రెండో సంవత్సరం చదువుతున్న ఆమెకు అభిమన్యు ప్రపోజ్ చేశాడు. ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరించడంతో, అభిమన్యు గీతను ఒప్పించమని ఒత్తిడి చేశాడు. అయితే, గీత దానిని పూర్తిగా తిరస్కరించింది.

Also Read:Gambhir vs Rohit: విజయ్ హజారేలో రోహిత్ శర్మ విధ్వంసం.. ‘గంభీర్ ఎక్కడ?’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి 1 గంటల ప్రాంతంలో అభిమన్యు, గీత ఈ విషయంపై గొడవ పడ్డారు. గీత మళ్ళీ నిరాకరించడంతో, అభిమన్యు ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశంతో గీతపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గీత అరుపులు విని ఆమె కూతురు అక్కడికి పరుగెత్తింది, కానీ అప్పటికే అభిమన్యు అక్కడి నుండి పారిపోయాడు. వెంటనే స్పందించిన పొరుగువారు గీతను ఆసుపత్రికి తరలించారు. ఆమెకు తీవ్ర కాలిన గాయాలు అయ్యాయని, ప్రాణాలతో పోరాడుతోందని వైద్యులు చెబుతున్నారు. గీత భర్త విజయ్ కుమార్ కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version