CM Yogi-JP Nadda: వేదికపై సీఎం యోగి చెవిలో నడ్డా గుసగుసలు.. దేని గురించి చర్చించారు?
- నేడు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం
- హాజరైన ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. బీజేపీ కేంద్ర నాయకులు
- వేదికపై సీఎం యోగి చెవిలో నడ్డా గుసగుసలు
- దేని గురించి చర్చించారు?
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం హర్యానాలోని పంచకులలో ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా యోగి వేదికపై కూర్చున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వద్దకు చేరుకుని ఆయనతో మాట్లాడారు. ఈ సమయంలో.. నడ్డా కూడా యోగి చెవిలో ఏదో చెప్పడం కనిపించింది. సంభాషణ ముగిసిన తర్వాత, యోగి తన సీటుకు తిరిగి వచ్చి కూర్చున్నారు. యూపీ ఉప ఎన్నికల సన్నద్ధతపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు చర్చ జరుగుతోంది. వేదికపై మొదటి వరుసలో యోగి, నడ్డా కూర్చున్నారు.
READ MORE: Badruddin Ajmal: పార్లమెంట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ వక్ఫ్ ఆస్తులే: ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
పంచకులలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రిగా ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) నాయకుడు నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)కి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అనిల్ విజ్, కృష్ణ లాల్ పన్వార్, రావ్ నర్బీర్ సింగ్లతో ప్రమాణం చేయించారు. వాల్మీకి జయంతి కావడంతో ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ ప్రాధాన్యత సంతరించుకుంది. వాల్మీకి మహర్షి హిందూ ఇతిహాసం రామాయణ రచయిత, దళితులలో ప్రత్యేకంగా గౌరవించబడ్డారు.
READ MORE:Stock market: మార్కెట్లో ఒడుదుడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు
90 స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం..
హర్యానా కేబినేట్లో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 14 మంది మంత్రులు ఉండొచ్చని సమాచారం. ఈ సందర్భంగా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సైనీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్టోబరు 5న హర్యానాలో జరిగిన ఎన్నికల్లో 90 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 48 స్థానాలను గెలుచుకుని చారిత్రాత్మకంగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!