YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో డీఎస్సీ-2025 నియామకాల వ్యవహారం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ఈ దీక్షా శిబిరం ఏర్పాటు అనుమతి లేకుండానే జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ క్రమంలో దీక్షా శిబిరం టెంట్ను టీడీపీ శ్రేణులు తొలగించగా.. దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను నిలువరించి.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విజయవాడలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తును ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలని వైసీపీ దీక్షలో పాల్గొన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెలి మాట్లాడుతూ… ‘మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. సీబీఐ విచారణ జరపించాలి. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఉద్యోగాలలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి, జీవోలు తారుమారు అయ్యాయి. విద్యా శాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. పోలీసు అధికారులు ఆలోచించాలి. ప్రజాస్వామ్య యుతంగా చేసే పోరాటాలపై అణచివేతకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!