MLA Thopudurthi Prakash Reddy: కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Thopudurthi Prakash Reddy: తనను, లోకేష్ను చంపేస్తారట అంటూ మాట్లాడిన చంద్రబాబు మాటలకు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 150 హత్యలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు. తనకు ప్రాణం హాని చేస్తారనే ఆందోళనతోనే తన అన్న తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అలా మాట్లాడి ఉండొచ్చని ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. పరిటాల రవి హయాంలో ఎన్ని హత్యలు జరిగాయో అందరికీ తెలుసన్నారు.
పరిటాల రవి అనుచరుడు జగ్గుతో అమ్మను తిట్టించారని.. కొడుకులుగా మాకు బాధ ఉండదా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని కల్గుతుందన్న బాధతో తన అన్న చంద్రశేఖర్ రెడ్డి అలా మాట్లాడి ఉండొచ్చని.. ఆయన మాట్లాడిన భాష మీద పెద్దలు మందలించారని.. క్షమాపణ కూడా చెప్పామన్నారు. మరి మా తల్లిని తిట్టిన దానికి ఒక్క టీడీపీ నేత అయినా తప్పు అని చెప్పారా అంటూ ప్రశ్నించారు. 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జనంలోకి వెళ్తామని ఆయన అన్నారు. వెళ్లిన ప్రతి చోటా తాము చేసిన అభివృద్ధి.. వారు చేస్తున్న అరాచకాలు చెప్తామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరిటాల సునీత తిట్టించిన అంశాన్ని కూడా జనానికి చెబుతామన్నారు. పరిటాల రవి నేర చరిత్ర చూసి టీడీపీలో రాజకీయ పట్టాభిషేకం చేశారని.. తమ సోదరుడైన చంద్రశేఖర్ రెడ్డిని అప్పట్లో పరిటాల రవి చంపాలని చూశారని ఆరోపించారు. ఆ సమాచారం చెప్పిన వారిని ఎన్ కౌంటర్ చేయించాడని ఆరోపణలు చేశారు.
Also Read
- FIFA World Cup 2026: 'కురాకో'కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
- Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
- FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. అనేలా మ్యాచ్.! నెదర్లాండ్స్కు వణుకు పుట్టించిన జపాన్..
- Harmanpreet Kaur History: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.! మిథాలీ రాజ్ రికార్డ్కు చెక్మెట్..
Chandrababu: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ”నన్ను, లోకేష్ని కూడా చంపేస్తారట..”
మద్దెల చెరువు సూరి కుటుంబం మొత్తాన్ని రవి చంపించారని.. అందుకే సూరి రవిని చంపి ప్రతీకారం తీర్చుకున్నారని ఆరోపించాడు. 150హత్యలు చేసినా వారికి ఎందుకు శిక్ష పడలేదు.. ఎవరు కాపాడారని ప్రశ్నించాడు. 2009లో నన్ను ఓడించేందుకు.. జైలులో ఉన్న సూరీతో రాజీ పడ్డారని ఆయన పేర్కొన్నారు. సూరిని భానుతో చంపించింది పరిటాల సునీతనే అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
Floating AI Data Centres: నీటిలో తేలియాడే AI డేటా సెంటర్లు.. శామ్సంగ్ కొత్త ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!
-
Investment Schemes for Women: ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన 5 పెట్టుబడి పథకాలు.. చిన్న పొదుపుతోనే లక్షల సంపద సొంతం!
-
Dulquer Salmaan Action film : గేమ్ మొదలు పెట్టబోతున్న దుల్కర్ సల్మాన్… క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Emergency Fund: కష్టకాలంలో కాపాడేది ఎమర్జెన్సీ ఫండ్.. ఎంత పొదుపు అవసరం? ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన విషయాలు
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
ట్రెండింగ్
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్పై హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!