Yatra Online IPO: యాత్రా ఆన్ లైన్ ఐపీవో షురూ.. ఒక్కో షేర్ ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yatra Online IPO: దేశంలో అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ యాత్రా ఆన్లైన్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ఈరోజు ప్రారంభమైంది. శుక్రవారం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరవడానికి ముందు, సెప్టెంబర్ 14న యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ మొత్తం రూ.348.75 కోట్లు వసూలు చేసింది. మొత్తం 33 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తాన్ని సేకరించారు. మీరు కూడా ఈ IPOలో డబ్బు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దాని ప్రైస్ బ్యాండ్, GMP, IPOకి సంబంధించిన ముఖ్యమైన తేదీల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
యాంకర్ రౌండ్ ఆఫ్ ట్రావెల్ వెబ్సైట్ యాత్ర ఆన్లైన్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలలో మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ సాక్స్, BNP పారిబాస్ ఆర్బిట్రేజ్, ఎలారా ఇండియా ఆపర్చునిటీ, వైట్ ఓక్ క్యాపిటల్, క్వాంటం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి కంపెనీలు ఉన్నాయి. దేశీయ కంపెనీలలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎడెల్వీస్ ట్రస్టీషిప్, టాటా మ్యూచువల్ ఫండ్ మొదలైన వాటి పేర్లు ఉన్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు 2,45,59,860 ఈక్విటీ షేర్లను జారీ చేయడం గమనార్హం. ఈ షేర్ల ధర ఒక్కో షేరుకు రూ.142గా నిర్ణయించారు.
Also Read
- DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
Read Also:BJP Bike Rally: హైదరాబాద్లో బీజేపీ బైక్ ర్యాలీ.. పాల్గొన్న కిషన్రెడ్డి
యాత్రా ఆన్లైన్ తన IPO ధరను ఒక్కో షేరుకు రూ.135 నుంచి రూ.142గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ.775 కోట్లు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందులో మొత్తం రూ.602 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయగా, 1.21 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్ ద్వారా మొత్తం రూ.62 కోట్లు సమీకరించింది. topsharebrokers.com ప్రకారం IPO, GMP ప్రస్తుతం రూ.0 ప్రీమియం వద్ద ఉంది. ఇది దాని ఇష్యూ ధర వద్ద మాత్రమే ఉంటుంది.
యాత్ర ఆన్లైన్ IPO ఈ రోజు నుండి అంటే సెప్టెంబర్ 15 నుండి పెట్టుబడిదారుల కోసం తెరవబడింది. సెప్టెంబరు 20 వరకు దీనిలో సబ్ స్కైబ్ చేసుకోవచ్చు. కంపెనీ సెప్టెంబర్ 25న షేర్లను కేటాయిస్తుంది. ఈ షేర్ల లిస్టింగ్ సెప్టెంబర్ 29న జరుగుతుంది. ఈ IPOలో 75 శాతం వాటాను సంస్థాగత కొనుగోలుదారులకు (QIB), 15 శాతం నికర సంస్థాగత పెట్టుబడిదారులకు, మిగిలిన 10 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించబడింది. కంపెనీ ఐపిఓ ద్వారా సమీకరించిన మొత్తంలో రూ.150 కోట్లను కొనుగోళ్లు, రాజకీయ పెట్టుబడుల కోసం ఉపయోగిస్తుంది. 392 కోట్లు కొనుగోలు, కొత్త టెక్నాలజీ కోసం వెచ్చించనున్నారు. మిగిలిన మొత్తం సాధారణ కార్పొరేట్ అవసరాలను తీర్చడానికి ఉపయోగించబడుతుంది.
Read Also:AP CM Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం జగన్
తాజావార్తలు
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..