Yatra Online IPO: యాత్రా ఆన్ లైన్ ఐపీవో షురూ.. ఒక్కో షేర్ ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yatra Online IPO: దేశంలో అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ యాత్రా ఆన్లైన్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ఈరోజు ప్రారంభమైంది. శుక్రవారం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరవడానికి ముందు, సెప్టెంబర్ 14న యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ మొత్తం రూ.348.75 కోట్లు వసూలు చేసింది. మొత్తం 33 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తాన్ని సేకరించారు. మీరు కూడా ఈ IPOలో డబ్బు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దాని ప్రైస్ బ్యాండ్, GMP, IPOకి సంబంధించిన ముఖ్యమైన తేదీల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
యాంకర్ రౌండ్ ఆఫ్ ట్రావెల్ వెబ్సైట్ యాత్ర ఆన్లైన్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలలో మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ సాక్స్, BNP పారిబాస్ ఆర్బిట్రేజ్, ఎలారా ఇండియా ఆపర్చునిటీ, వైట్ ఓక్ క్యాపిటల్, క్వాంటం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి కంపెనీలు ఉన్నాయి. దేశీయ కంపెనీలలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎడెల్వీస్ ట్రస్టీషిప్, టాటా మ్యూచువల్ ఫండ్ మొదలైన వాటి పేర్లు ఉన్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు 2,45,59,860 ఈక్విటీ షేర్లను జారీ చేయడం గమనార్హం. ఈ షేర్ల ధర ఒక్కో షేరుకు రూ.142గా నిర్ణయించారు.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
Read Also:BJP Bike Rally: హైదరాబాద్లో బీజేపీ బైక్ ర్యాలీ.. పాల్గొన్న కిషన్రెడ్డి
యాత్రా ఆన్లైన్ తన IPO ధరను ఒక్కో షేరుకు రూ.135 నుంచి రూ.142గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ.775 కోట్లు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందులో మొత్తం రూ.602 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయగా, 1.21 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్ ద్వారా మొత్తం రూ.62 కోట్లు సమీకరించింది. topsharebrokers.com ప్రకారం IPO, GMP ప్రస్తుతం రూ.0 ప్రీమియం వద్ద ఉంది. ఇది దాని ఇష్యూ ధర వద్ద మాత్రమే ఉంటుంది.
యాత్ర ఆన్లైన్ IPO ఈ రోజు నుండి అంటే సెప్టెంబర్ 15 నుండి పెట్టుబడిదారుల కోసం తెరవబడింది. సెప్టెంబరు 20 వరకు దీనిలో సబ్ స్కైబ్ చేసుకోవచ్చు. కంపెనీ సెప్టెంబర్ 25న షేర్లను కేటాయిస్తుంది. ఈ షేర్ల లిస్టింగ్ సెప్టెంబర్ 29న జరుగుతుంది. ఈ IPOలో 75 శాతం వాటాను సంస్థాగత కొనుగోలుదారులకు (QIB), 15 శాతం నికర సంస్థాగత పెట్టుబడిదారులకు, మిగిలిన 10 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించబడింది. కంపెనీ ఐపిఓ ద్వారా సమీకరించిన మొత్తంలో రూ.150 కోట్లను కొనుగోళ్లు, రాజకీయ పెట్టుబడుల కోసం ఉపయోగిస్తుంది. 392 కోట్లు కొనుగోలు, కొత్త టెక్నాలజీ కోసం వెచ్చించనున్నారు. మిగిలిన మొత్తం సాధారణ కార్పొరేట్ అవసరాలను తీర్చడానికి ఉపయోగించబడుతుంది.
Read Also:AP CM Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం జగన్
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!