Yashasvi Jaiswal: టాప్ ప్లేయర్లను కాదని ఐసీసీ అవార్డును కైవసం చేసుకున్న యశస్వి జైస్వాల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal: ప్రస్తుత టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ క్రికెట్ చరిత్రలో రికార్డుల మోత మోగిస్తున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాగా ముగిసిన టీమిండియా, ఇంగ్లాండ్ టీంల మధ్య జరిగిన టెస్టు సిరీస్ లో యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారించడంతో అనేక కొత్త రికార్డులను సృష్టించాడు. తాజాగా ముగిసిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా బ్యాట్తో విధ్వంసం సృష్టించి ఇంగ్లాండ్ బౌలర్లని ఉతికిపారేశాడు. ఇందులో ముఖ్యంగా వరుస డబుల్ సెంచరీలు సాధించిన యంగ్ ప్లేయర్ గా జైస్వాల్ రికార్డు బద్దలు కొట్టాడు.
Read Also: Salman Khan : ఆ సౌత్ స్టార్ డైరెక్టర్ తో కొత్త సినిమా ప్రకటించిన సల్మాన్ ఖాన్..
Also Read
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
ఇక, ఈ సిరీస్ లో యశస్వి జైస్వాల్ 712 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎంతో అద్భుతమైన ఆటతీరుతో ముందుకు వెళ్తున్న యశస్వి జైస్వాల్ ను తాజాగా ఐసీసీకి చెందిన అవార్డు వరించింది. ఇక ఈ విషయం చూస్తే.. ఫిబ్రవరి నెలకు గానూ జైస్వాల్ ను ” ప్లేయర్ ఆఫ్ ది మంత్ ” గా ఐసీసీ ఎన్నుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కొరకు జైస్వాల్ తో పాటు న్యూజిలాండ్ నుండి కేన్ విలియమ్సన్, శ్రీలంక నుండి పాతుమ్ నిస్సాంకలు గట్టి పోటీ ఇచ్చారు. ముందుగా ఈ ముగ్గురు ఆటగాళ్లను ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఐసీసీ నామినేట్ చేయగా.. ఇందులో న్యూజిలాండ్ కు చెందిన కేన్ విలియమ్సన్, శ్రీలంకకు చెందిన పాతుమ్ నిస్సాంకలను వెనక్కినెట్టి జైస్వాల్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుపొందాడు.
Read Also: Rashmika Mandanna : రష్మిక మందన్న మరో డీప్ ఫేక్ వీడియో వైరల్..
ముందుముందు ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా యశస్వి జైస్వాల్ రాణిస్తాడని అతని గణాంకాలు చెబుతున్నాయని ఐసీసీ ఈ సందర్భంగా తెలిపింది. ఇక ప్రస్తుతం నడుస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడని ఐసీసీ పేర్కొంది. గడిచిన నెలలో ఇంగ్లండ్ పై వరుస మ్యాచ్ లలో ఏకంగా రెండు అద్భుతమైన డబుల్ సెంచరీలను సాధించాడు. మొదటి డబుల్ సెంచరీ విశాఖపట్నంలో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులు చేసాడు., ఆఫై రాజ్ కోట్ లో జరిగిన మరుసటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీని సాధించాడు. ఇకపోతే యశస్వి జైస్వాల్ కేవలం వరుస డబుల్ సెంచరీలు మాత్రమే కాకుండా ఫిబ్రవరి మాసంలో జైస్వాల్ అనేక రికార్డులను కొల్లగొట్టాడు.
తాజావార్తలు
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?