WTC Points Table: కర్మ తిరగబడింది.. వెస్టిండీస్ దెబ్బకి కుప్పకూలిన పాకిస్థాన్ ఆశలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లోని తొలి పోరులో పాకిస్థాన్ 90 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో పాకిస్థాన్కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. వెస్టిండీస్తో మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాయింట్ల పట్టిక స్థానాల్లో ఎలాంటి పెద్ద మార్పులు లేవు. పాకిస్థాన్ ఆడిన 5 మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి, 6.67 గెలుపు శాతంతో 9 జట్ల పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ జట్టు ఈ విజయంతో తన గెలుపు శాతాన్ని స్వల్పంగా పెంచుకున్నప్పటికీ 22.73 శాతంతో 8వ స్థానంలోనే ఉంది.
మరోవైపు ఈ సైకిల్లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ ఆడిన 8 మ్యాచ్లలో 7 విజయాలు సాధించి 87.50 గెలుపు శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఛాంపియన్ దక్షిణాఫ్రికా 4 మ్యాచ్లలో 3 గెలిచి 75 శాతం విజయాలతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 6 మ్యాచ్లలో 4 విజయాలతో 72.22 శాతంతో మూడో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 4 మ్యాచ్లలో 2 గెలిచి 58.33 శాతంతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
Also Read
- Pakistan: మా ఉగ్రవాదులే మాపై తిరగబడుతున్నారు.. ఒప్పుకున్న పాకిస్తాన్..
- Lok Sabha: లోక్సభలో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు
- CJP: మోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముడదాం.. రైతులతో కలిసి కాక్రోచ్ల ప్లాన్..
- Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్లలో 4 విజయాలు, 4 ఓటములు, ఒక డ్రాతో 48.15 గెలుపు శాతాన్ని కలిగి ఉంది. శ్రీలంక జట్టు 41.67 గెలుపు శాతంతో ఆరో స్థానంలో నిలవగా, ఇంగ్లాండ్ జట్టు ఆడిన 13 మ్యాచ్లలో కేవలం 4 మాత్రమే గెలిచి 24.36 గెలుపు శాతంతో ఏడో స్థానంలో పరిమితమైంది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తాయి. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఈ డబ్ల్యూటీసీ ట్రోఫీని గెలుచుకున్నాయి. ప్రస్తుత సైకిల్ ఫైనల్ పోరు 2027లో ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానంలో జరగనుంది.
తాజావార్తలు
-
Mulugu Rains : ములుగును ముంచెత్తిన వర్షాలు.. 25 గ్రామాలకు రాకపోకలు బంద్.!
-
WTC Points Table: కర్మ తిరగబడింది.. వెస్టిండీస్ దెబ్బకి కుప్పకూలిన పాకిస్థాన్ ఆశలు..
-
Pakistan: మా ఉగ్రవాదులే మాపై తిరగబడుతున్నారు.. ఒప్పుకున్న పాకిస్తాన్..
-
Venky Atluri: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత ఆ స్టార్ హీరోతో వెంకీ అట్లూరి సినిమా!
-
Chennai Love Story :రివ్యూయర్స్ ను తిట్టకుండా.. మాట విన్నారు, హిట్టు కొట్టారు!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!