Wrestlers Protest: దేశ రాజధానిలో ఉద్రిక్తత.. పార్లమెంట్ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం
Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలంటూ మల్లయోధులు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మల్లయోధులు, వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు ఆదివారం పార్లమెంటు భవనం సమీపంలో ‘మహిళా సమ్మన్ మహాపంచాయత్’కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంట్ భవనం వైపు కవాతు చేస్తున్న రెజ్లర్లను జంతర్ మంతర్ వద్ద బారికేడ్లతో నిర్బంధించారు. నిరసనకారులపై అణిచివేత ప్రారంభించిన పోలీసులు జంతర్ మంతర్ నుంచి టెంట్లను కూడా తొలగించి నిరసన స్థలాన్ని క్లియర్ చేశారు. రెజ్లర్ బజరంగ్ పునియా కూడా పార్లమెంట్ భవనం వైపు కవాతు చేస్తున్న సమయంలో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీధుల్లోకి రావడం తమ హక్కు అంటూ నిరసనకారులు దీనిని శాంతియుత యాత్రగా పేర్కొన్నారు. రెజ్లర్లు పిలుపునిచ్చిన ‘మహిళా సమ్మాన్ మహాపంచాయత్’ కోసం కొత్త పార్లమెంట్ భవనం వైపు కవాతు చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలిపిన రెజ్లర్లు కొత్త పార్లమెంట్ భవనం వైపు కవాతు చేసేందుకు జంతర్ మంతర్ వద్ద ఉన్న పోలీసు బారికేడ్లపై నుంచి కూడా దూకారు.
ఆందోళనకారులను పోలీసులు నిర్బంధించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ పలువురు అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులకు పైగా ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజ్రంగ్ పునియా తదితరులు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం మహిళా సమ్మాన్ మహాపంచాయత్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు పార్లమెంట్ భవనానికి రెండు కిలోమీటర్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెజ్లర్లు పార్లమెంట్వైపు కవాతును కొనసాగిస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లు వినేష్ ఫొగాట్, సంగీతా ఫొగాట్ తదితరులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నించగా.. ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఆందోళనకారులందరినీ నిర్బంధించారు. నిరసనకారులందరినీ పోలీసులు బస్సుల్లో నిర్బంధించారు. రెజ్లర్లు శాంతిభద్రతలను ఉల్లంఘించినందుకు గాను తగిన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ దీపేంద్ర పాఠక్ తెలిపారు. బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు కొనసాగిస్తున్న దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు.
Read Also: Pakistan: పోలీసులే నా కారును దొంగిలించారు.. పీటీఐ నేత ఆరోపణలు
కొత్త పార్లమెంట్ భవనం వెలుపల ఆందోళన చేస్తున్న రెజ్లర్లు పిలుపునిచ్చిన నిరసనలో పాల్గొనేందుకు దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీకేయూ నేత రాకేష్ టికైత్ నేతృత్వంలోని రైతులను ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఆదివారం ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
ఈరోజు ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ హౌస్ వైపు రెజ్లర్ల నిరసన ప్రదర్శనలో ఖాప్ పంచాయితీ నాయకులు, రైతులు పాల్గొననున్నందున తిక్రీ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ కేసులో కొత్త కోణం..
-
New Pensions: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి కూడా పెన్షన్లు..
-
MGNREGS: ఉపాధి హామీకి కౌంట్ డౌన్.. ఫుల్ పవర్స్ వారికే..
-
Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..
-
Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం.!
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?