Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Wrestlers Detained Protest Site Cleared As Cops Crack Down On March To New Parliament

Wrestlers Protest: దేశ రాజధానిలో ఉద్రిక్తత.. పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం

Published Date :May 28, 2023 , 5:10 pm
By Mahesh Jakki
Wrestlers Protest: దేశ రాజధానిలో ఉద్రిక్తత.. పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మల్లయోధులు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మల్లయోధులు, వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు ఆదివారం పార్లమెంటు భవనం సమీపంలో ‘మహిళా సమ్మన్ మహాపంచాయత్’కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంట్ భవనం వైపు కవాతు చేస్తున్న రెజ్లర్లను జంతర్ మంతర్ వద్ద బారికేడ్లతో నిర్బంధించారు. నిరసనకారులపై అణిచివేత ప్రారంభించిన పోలీసులు జంతర్ మంతర్ నుంచి టెంట్లను కూడా తొలగించి నిరసన స్థలాన్ని క్లియర్ చేశారు. రెజ్లర్ బజరంగ్ పునియా కూడా పార్లమెంట్ భవనం వైపు కవాతు చేస్తున్న సమయంలో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీధుల్లోకి రావడం తమ హక్కు అంటూ నిరసనకారులు దీనిని శాంతియుత యాత్రగా పేర్కొన్నారు. రెజ్లర్లు పిలుపునిచ్చిన ‘మహిళా సమ్మాన్ మహాపంచాయత్’ కోసం కొత్త పార్లమెంట్ భవనం వైపు కవాతు చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలిపిన రెజ్లర్లు కొత్త పార్లమెంట్ భవనం వైపు కవాతు చేసేందుకు జంతర్ మంతర్ వద్ద ఉన్న పోలీసు బారికేడ్లపై నుంచి కూడా దూకారు.

ఆందోళనకారులను పోలీసులు నిర్బంధించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ పలువురు అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు నెల రోజులకు పైగా ప్రముఖ రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌, బజ్‌రంగ్‌ పునియా తదితరులు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం మహిళా సమ్మాన్‌ మహాపంచాయత్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు పార్లమెంట్‌ భవనానికి రెండు కిలోమీటర్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెజ్లర్లు పార్లమెంట్‌వైపు కవాతును కొనసాగిస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లు వినేష్‌ ఫొగాట్, సంగీతా ఫొగాట్ తదితరులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నించగా.. ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఆందోళనకారులందరినీ నిర్బంధించారు. నిరసనకారులందరినీ పోలీసులు బస్సుల్లో నిర్బంధించారు. రెజ్లర్లు శాంతిభద్రతలను ఉల్లంఘించినందుకు గాను తగిన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రత్యేక కమిషనర్‌ దీపేంద్ర పాఠక్ తెలిపారు. బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు కొనసాగిస్తున్న దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు.

Read Also: Pakistan: పోలీసులే నా కారును దొంగిలించారు.. పీటీఐ నేత ఆరోపణలు

కొత్త పార్లమెంట్ భవనం వెలుపల ఆందోళన చేస్తున్న రెజ్లర్లు పిలుపునిచ్చిన నిరసనలో పాల్గొనేందుకు దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీకేయూ నేత రాకేష్ టికైత్ నేతృత్వంలోని రైతులను ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఆదివారం ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
ఈరోజు ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ హౌస్ వైపు రెజ్లర్ల నిరసన ప్రదర్శనలో ఖాప్ పంచాయితీ నాయకులు, రైతులు పాల్గొననున్నందున తిక్రీ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bajrang Punia
  • Brij Bhushan Sharan Singh
  • Delhi
  • jantarmantar
  • mahila samman mahapanchayat

తాజావార్తలు

  • T20 World Cup Final Live Updates : ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ అమీతూమీ..

  • Aqua Sector: ఆక్వా రంగంపై యుద్ధం ప్రభావం

  • UAE Attacks On Iran: ముదురుతున్న యుద్ధం.. ఇరాన్ తిక్క కుదిర్చిన యూఏఈ..

  • Prithvi Shaw Engagement: అకృతి అగర్వాల్ తో పృథ్వీ షా ఎంగేజ్మెంట్.. ఆమె ఎవరంటే?

  • Sushmita Konidela: మేనకోడలిపై సుస్మిత కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. క్లీంకార అత్తను టీజ్ చేసి మరీ పారిపోతుందట!

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions