OIC Kashmir Meeting: అగ్రరాజ్యంలో భారత్కు వ్యతిరేకంగా ముస్లిం దేశాల సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OIC Kashmir Meeting: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్లో కాశ్మీర్పై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) కాంటాక్ట్ గ్రూప్ సమావేశమైంది. ఈ సమావేశంలో అజర్బైజాన్, పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా, నైజర్ దేశాల విదేశాంగ మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి OIC సెక్రటరీ జనరల్ హిస్సేన్ బ్రహ్మిమ్ తహా అధ్యక్షత వహించారు. ఇందులో కాశ్మీరీ ప్రతినిధి బృందం కూడా పాల్గొన్నారు. భారత్లోని జమ్మూ కాశ్మీర్లో రాజకీయ, భద్రతా పరిస్థితిని వారి సమావేశంలో సమీక్షించినట్లు సమాచారం. కాశ్మీర్ అంశంపై ఈ దేశాల వాదన ఏంటి, ఈ సమావేశంపై భారత్ స్పందన ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం..
READ ALSO: Harish Rao : కాళ్లు కట్టేసి లాఠీలతో బాదడమేనా.. ప్రజాస్వామ్యమా.?
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
సమావేశంలో కాశ్మీర్ అంశంపై చర్చ..
పాకిస్థాన్ ప్రధానమంత్రి విదేశాంగ శాఖ ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫతేమి మాట్లాడుతూ.. దక్షిణాసియాలో శాశ్వత శాంతి కాశ్మీర్ వివాద పరిష్కారంతో ముడిపడి ఉందని అన్నారు. వెంటనే రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతదేశంపై నిర్మాణాత్మక ఒత్తిడి తీసుకురావాలని ఆయన OICని కోరారు. భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణను OIC స్వాగతించింది. కాశ్మీర్ సమస్య పరిష్కారం లేకుండా ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి కష్టమని ఇటీవలి సంఘటనలు చూపిస్తున్నాయని సంస్థ పేర్కొంది. ప్రాంతీయ నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలను దెబ్బతీస్తుందని సమావేశం వాళ్లు అన్నారు. సమావేశంలో OIC రాజకీయ కార్యకర్తలు, మానవ హక్కుల పరిరక్షకులను పెద్ద ఎత్తున అరెస్టు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీనగర్లోని జామియా మసీదు, ఈద్గా వద్ద మతపరమైన సమావేశాలపై విధించిన ఆంక్షలను అన్యాయమని ఖండించింది.
టర్కీ అధ్యక్షుడికి భారత్ కౌంటర్..
న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) వేదిక నుంచి టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. భారతదేశం – పాకిస్థాన్ మధ్య చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్లోని ముస్లిం సోదర సోదరీమణుల కోసం, ఈ సమస్యను UN భద్రతా మండలి సహాయంతో పరిష్కరించాలని అన్నారు. ఆయన గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను భారతదేశం తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్ అనేది భారత అంతర్గత విషయం అని ఇండియా పేర్కొంది.
READ ALSO: GST 2.0 Complaint Process: ప్రజలకు గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్లు తగ్గించకపోతే.. ఈ పని చేయండి
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..