Mohammad Yunus: పాపం యూనస్..! అమెరికా సాక్షిగా ఘోర అవమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Yunus: బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్కు అగ్రరాజ్యం సాక్షిగా ఘోర అవమానం ఎదురైంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్ చేరుకున్న యూనస్ బృందంపై పలువురు గుడ్లతో దాడి చేశారు. అలాగే ఆయన గత మూడు రోజులుగా న్యూయార్క్లో ఒక్క ప్రముఖ నాయకుడిని కూడా కలవలేకపోయాడు. ముస్లిం దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్ను కూడా ఒంటరిని చేశాయనే వాదనలు వినిస్తున్నాయి.
READ ALSO: Finland: ‘‘భారత్ ఒక సూపర్ పవర్’’..ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ప్రశంసలు..
Also Read
- Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
గుడ్లతో స్వాగతం..
షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఆగస్టు 2024లో కూలదోసిన తర్వాత బంగ్లాదేశ్లో యూనస్ అధికార పగ్గాలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బంగ్లాదేశ్ తరఫున మాట్లాడటానికి న్యూయార్స్కు వచ్చారు. ఆయనతో పాటు బంగ్లాదేశ్ రాజకీయ నాయకుల బృందం కూడా వచ్చింది. ఈక్రమంలో మొహమ్మద్ యూనస్ సోమవారం (సెప్టెంబర్ 22) తన ప్రతినిధి బృందంతో అమెరికాకు చేరుకున్న సమయంలో వారిపై షేక్ హసీనా మద్దతుదారులు గుడ్లు విసిరారు. అలాగే యూనస్ కారును కూడా ఆపారు. అరెస్టు చేసిన నిందితులను పోలీసులు 24 గంటల్లో విడుదల చేశారు. 193 దేశాల నాయకులు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్లో ఉన్న సమయంలో, అమెరికాలో యూనస్ ఇంత వ్యతిరేకతను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
అగ్ర నాయకులతో సమావేశం కాలేదు..
బంగ్లాదేశ్ తాత్కాలిక అధిపతి యూనస్ గత మూడు రోజుల్లో ఒక్క ప్రధాన దేశ నాయకుడిని కూడా కలవలేదు. న్యూయార్క్లో యూనస్ కేవలం చిన్న దేశాల నాయకులు, అధికారులను మాత్రమే కలిశారు. ఇప్పటి వరకు యూనస్ పారిస్ మేయర్, అమెరికన్ రాయబారిని మాత్రమే కలిశారు. కానీ పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్, తుర్కియే వంటి దేశాల అధిపతులను కలిశారు. షాబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్తో కూడా సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యూనస్ సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక చర్చలు ఎందుకు జరపడం లేదో స్పందించలేదు.
ముస్లిం నాయకుల సమావేశానికి కూడా ఆయన గైర్హాజరు అయ్యారు. ముస్లిం దేశాల నాయకులు న్యూయార్క్లో రెండు ప్రధాన సమావేశాలు నిర్వహించారు. ఒకటి గాజాపై, మరొకటి కాశ్మీర్పై వారు సమావేశం అయ్యారు. బంగ్లాదేశ్ను ఈ రెండు సమావేశాలకు ఆహ్వానించనట్లు సమాచారం. బంగ్లాదేశ్ ఒక ముస్లిం మెజారిటీ దేశం. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, యూనస్ దేశంలో అధికార పగ్గాలు స్వీకరించారు. అనంతరం ఆయన పాకిస్థాన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపారు.
READ ALSO: OIC Kashmir Meeting: అగ్రరాజ్యంలో భారత్కు వ్యతిరేకంగా ముస్లిం దేశాల సమావేశం..
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!