Mohammad Yunus: పాపం యూనస్..! అమెరికా సాక్షిగా ఘోర అవమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Yunus: బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్కు అగ్రరాజ్యం సాక్షిగా ఘోర అవమానం ఎదురైంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్ చేరుకున్న యూనస్ బృందంపై పలువురు గుడ్లతో దాడి చేశారు. అలాగే ఆయన గత మూడు రోజులుగా న్యూయార్క్లో ఒక్క ప్రముఖ నాయకుడిని కూడా కలవలేకపోయాడు. ముస్లిం దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్ను కూడా ఒంటరిని చేశాయనే వాదనలు వినిస్తున్నాయి.
READ ALSO: Finland: ‘‘భారత్ ఒక సూపర్ పవర్’’..ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ప్రశంసలు..
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
గుడ్లతో స్వాగతం..
షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఆగస్టు 2024లో కూలదోసిన తర్వాత బంగ్లాదేశ్లో యూనస్ అధికార పగ్గాలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బంగ్లాదేశ్ తరఫున మాట్లాడటానికి న్యూయార్స్కు వచ్చారు. ఆయనతో పాటు బంగ్లాదేశ్ రాజకీయ నాయకుల బృందం కూడా వచ్చింది. ఈక్రమంలో మొహమ్మద్ యూనస్ సోమవారం (సెప్టెంబర్ 22) తన ప్రతినిధి బృందంతో అమెరికాకు చేరుకున్న సమయంలో వారిపై షేక్ హసీనా మద్దతుదారులు గుడ్లు విసిరారు. అలాగే యూనస్ కారును కూడా ఆపారు. అరెస్టు చేసిన నిందితులను పోలీసులు 24 గంటల్లో విడుదల చేశారు. 193 దేశాల నాయకులు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్లో ఉన్న సమయంలో, అమెరికాలో యూనస్ ఇంత వ్యతిరేకతను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
అగ్ర నాయకులతో సమావేశం కాలేదు..
బంగ్లాదేశ్ తాత్కాలిక అధిపతి యూనస్ గత మూడు రోజుల్లో ఒక్క ప్రధాన దేశ నాయకుడిని కూడా కలవలేదు. న్యూయార్క్లో యూనస్ కేవలం చిన్న దేశాల నాయకులు, అధికారులను మాత్రమే కలిశారు. ఇప్పటి వరకు యూనస్ పారిస్ మేయర్, అమెరికన్ రాయబారిని మాత్రమే కలిశారు. కానీ పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్, తుర్కియే వంటి దేశాల అధిపతులను కలిశారు. షాబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్తో కూడా సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యూనస్ సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక చర్చలు ఎందుకు జరపడం లేదో స్పందించలేదు.
ముస్లిం నాయకుల సమావేశానికి కూడా ఆయన గైర్హాజరు అయ్యారు. ముస్లిం దేశాల నాయకులు న్యూయార్క్లో రెండు ప్రధాన సమావేశాలు నిర్వహించారు. ఒకటి గాజాపై, మరొకటి కాశ్మీర్పై వారు సమావేశం అయ్యారు. బంగ్లాదేశ్ను ఈ రెండు సమావేశాలకు ఆహ్వానించనట్లు సమాచారం. బంగ్లాదేశ్ ఒక ముస్లిం మెజారిటీ దేశం. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, యూనస్ దేశంలో అధికార పగ్గాలు స్వీకరించారు. అనంతరం ఆయన పాకిస్థాన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపారు.
READ ALSO: OIC Kashmir Meeting: అగ్రరాజ్యంలో భారత్కు వ్యతిరేకంగా ముస్లిం దేశాల సమావేశం..
తాజావార్తలు
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!