World Cup 2023 Semi Final Scenario: ఆ రెండు టీమ్స్ గెలిస్తే.. నాలుగు జట్లు ఔట్! నేడు డబుల్ ధమాకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ODI World Cup 2023 Semi Final Scenario: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా క్రికెట్ అభిమానులకు నేడు డబుల్ ధమాకా ఉంది. నేడు రెండు కీలక మ్యాచ్లు జరగనున్నాయి. శనివారం ఉదయం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడనుండగా.. మధ్యాహ్నం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. సెమీస్ రసవత్తరంగా మారిన నేపథ్యంలో నేటి రెండు మ్యాచ్లు కీలకంగా మారాయి. రెండు మ్యాచ్లు కూడా అభిమానులకు మంచి వినోదాన్ని పంచె అవకాశాలు ఉన్నాయి.
ప్రపంచకప్ 2023లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లలో నాలుగు గెలిచిన ఆస్ట్రేలియా.. సెమీస్ బెర్త్ లక్ష్యంగా నేడు బరిలోకి దిగుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి విమర్శల పాలైన ఆసీస్.. బలంగా పుంజుకుని వరుసగా నాలుగు విజయాలు అందుకుంది. వరుస విజయాలతో సెమీస్ అవకాశాలను బాగా మెరుగుపరుచుకుంది. ఇంగ్లండ్పై గెలిస్తే ఆసీస్ మరో అడుగు ముందుకేస్తుంది. అందుకే గెలుపే లక్ష్యంగా ఆసీస్ బరిలోకి దిగుతోంది. అయితే గాయంతో గ్లెన్ మ్యాక్స్వెల్, వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్కు దూరం కావడం ఎదురుదెబ్బే అని చెప్పాలి. మరోవైపు 6 మ్యాచ్ల్లో 5 ఓడి.. దాదాపుగా సెమీస్ నుంచి తప్పుకున్న ఇంగ్లీష్ జట్టు పరువు కోసం పోరాడనుంది. ఎలాగూ సెమీస్ చేరే అవకాశం లేదు కాబట్టి.. ఇంగ్లండ్ తెగించి ఆడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆసీస్కు విజయం అంత తేలిక కాకపోవచ్చు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
మరోవైపు నాలుగు వరుస విజయాలతో టోర్నీని ఘనంగా ఆరంభించిన న్యూజిలాండ్.. ఆపై హ్యాట్రిక్ ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగా.. పేసర్ మాట్ హెన్రీ గాయంతో టోర్నీ మొత్తానికి దూరం కావడం షాకే. కివీస్ సెమీస్ చేరాలంటే నేటి మ్యాచ్లో విజయం సాదించాల్సిందే. 7 మ్యాచ్లలో మూడు విజయాలు అందుకున్న పాకిస్థాన్కు సెమీస్ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయినా లేపాక్ ఆశతోనే ఉంది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
Also Read: ENG vs AUS: 15 మంది ప్లేయర్స్ మాత్రమేనా.. ప్రపంచకప్కు మంచిది కాదు: ప్యాట్ కమిన్స్
ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్లలో విజయాలు సాధించిన భారత్ 14 పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్ తప్ప ఇప్పటివరకు మరే జట్టు కప్పదా అధికారిక బెర్త్ దక్కించుకోలేదు. ఆరు విజయాలు సాదించిన దక్షిణాఫ్రికా దాదాపుగా సెమీస్ చేరినట్టే.ఇక రెండు స్థానాల కోసం రసవత్తర పోటీ జరుగుతోంది. అయితే నేడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు గెలిస్తే.. పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. అఫ్గానిస్తాన్ జట్టుకు ఇంకా అవకాశాలు ఉండగా.. బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తాజావార్తలు
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!