Site icon NTV Telugu

Asaduddin Owaisi: 2024లో నుపుర్ శర్మ ఢిల్లీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సస్పెండ్ అయిన బీజేపీ నేత నుపుర్ శర్మ ఢిల్లీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ గతేడాది జూన్ నెలలో ఒక న్యూస్ ఛానెల్‌లో జరిగిన చర్చలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. నుపుర్‌పై బీజేపీ చర్యపై ఒవైసీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమె ఖచ్చితంగా తిరిగి వచ్చి బీజేపీ తరపున ఎన్నికల్లో పోరాడుతుందని ఒవైసీ అన్నారు. బీజేపీ ఆమెను ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందని .. ఆమెను లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి అభ్యర్థిని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అన్నారు.

Smuggling : ఎయిర్ పోర్టుల్లో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత

2022లో ఓ న్యూస్ ఛానల్‌లో చర్చ సందర్భంగా నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా, విదేశాల్లోని ముస్లింలకు ఆగ్రహం తెప్పించాయి. 54 ఏళ్ల రసాయన శాస్త్రవేత్త ఉమేష్ కోల్హే హత్యతో సహా అనేక సంఘాల మధ్య హింసాత్మక సంఘటనలకు దారితీసింది. నుపుర్‌కు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకు ప్రతీకారంగా కోల్హే హత్యకు గురైనట్లు విచారణ అధికారులు భావిస్తున్నారు. ప్రవక్తపై నుపుర్ శర్మ మేలో చేసిన ప్రకటనలను కోల్హే సమర్థించారు. జూన్ 21, 2022న, మహారాష్ట్రలోని అమరావతిలో కోల్హేను మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతని గొంతు నులిమి చంపారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకు ఒక దుకాణదారుని ఇద్దరు వ్యక్తులు నరికి చంపారు.

Exit mobile version