Womens T20 World Cup: విండీస్తో పోరుకు హర్మన్సేన రెడీ..మంధానా వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. ఈ మెగాటోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో హర్మన్సేన అద్భుత విజయాన్ని సాధించింది. ఇక ఆ మరుసటి రోజే భారత అమ్మాయిలపై కోట్ల వర్షం కురిసింది. విమెన్స్ ప్రిమియర్ లీగ్ వేలంలో మన అమ్మాయిలు అంచనాలను మించి ధరలు దక్కించుకున్నారు. ఇదే ఉత్సాహంతో టీ20 ప్రపంచకప్లో తమ రెండో పోరుకు సిద్ధమయ్యారు. బుధవారం వెస్టిండీస్ను ఢీకొట్టనున్న భారత్.. వరుసగా రెండో విజయంతో సెమీస్ బెర్తు దిశగా మరో అడుగు వేయాలని చూస్తోంది.
Also Read: WPL 2023: విమెన్స్ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదిగో..తొలి మ్యాచ్ వీరి మధ్యే!
Also Read
పాక్పై కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించి విజయం సాధించడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. పైగా ఆ మ్యాచ్కు గాయం కారణంగా అందుబాటులో లేని స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా.. విండీస్పై బరిలోకి దిగనుంది. మరోవైపు విండీస్ తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ జట్టుపై హర్మన్ప్రీత్ సేనకు మంచి రికార్డే ఉంది. ప్రస్తుతం భారత్ జోరు ముందు విండీస్ నిలవడం కష్టమే. పాక్పై చెలరేగి ఆడిన జెమీమా, రిచాలపై మంచి అంచనాలున్నాయి. స్మృతి రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది. కానీ బౌలింగ్ విషయంలో మాత్రం భారత్కు కంగారు తప్పట్లేదు.
Also Read: Sania Mirza: ఆర్సీబీ మెంటర్గా సానియా..అందమంతా ఆ టీమ్లోనే!
పాక్తో తొలి పది ఓవర్ల వరకు బౌలర్లు ఆకట్టుకున్నా.. తర్వాతి పది ఓవర్లలో ఏకంగా 91 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. స్పిన్నర్ రాధా యాదవ్ మినహా బౌలర్లందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. కొన్ని మ్యాచ్ల నుంచి పేసర్ రేణుకా సింగ్ సత్తా చాటలేకపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వార్మప్ మ్యాచ్ల్లో సత్తా చాటిన అనుభవజ్ఞురాలు శిఖాను.. రేణుక లేదా పూజ స్థానంలో తుది జట్టులో తీసుకుంటారేమో చూడాలి. స్పిన్నర్లు దీప్తి, రాజేశ్వరి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరముంది. విండీస్ ఎక్కువగా కెప్టెన్ హేలీ మాథ్యూస్ మీద ఆధారపడుతోంది. బ్యాటింగ్లో ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది.
Also Read: Man Kills Partner: ప్రియురాలిని హత్య చేసి పరుపులో మూటకట్టేశాడు..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!