Womens T20 World Cup: విండీస్తో పోరుకు హర్మన్సేన రెడీ..మంధానా వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. ఈ మెగాటోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో హర్మన్సేన అద్భుత విజయాన్ని సాధించింది. ఇక ఆ మరుసటి రోజే భారత అమ్మాయిలపై కోట్ల వర్షం కురిసింది. విమెన్స్ ప్రిమియర్ లీగ్ వేలంలో మన అమ్మాయిలు అంచనాలను మించి ధరలు దక్కించుకున్నారు. ఇదే ఉత్సాహంతో టీ20 ప్రపంచకప్లో తమ రెండో పోరుకు సిద్ధమయ్యారు. బుధవారం వెస్టిండీస్ను ఢీకొట్టనున్న భారత్.. వరుసగా రెండో విజయంతో సెమీస్ బెర్తు దిశగా మరో అడుగు వేయాలని చూస్తోంది.
Also Read: WPL 2023: విమెన్స్ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదిగో..తొలి మ్యాచ్ వీరి మధ్యే!
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
పాక్పై కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించి విజయం సాధించడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. పైగా ఆ మ్యాచ్కు గాయం కారణంగా అందుబాటులో లేని స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా.. విండీస్పై బరిలోకి దిగనుంది. మరోవైపు విండీస్ తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ జట్టుపై హర్మన్ప్రీత్ సేనకు మంచి రికార్డే ఉంది. ప్రస్తుతం భారత్ జోరు ముందు విండీస్ నిలవడం కష్టమే. పాక్పై చెలరేగి ఆడిన జెమీమా, రిచాలపై మంచి అంచనాలున్నాయి. స్మృతి రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది. కానీ బౌలింగ్ విషయంలో మాత్రం భారత్కు కంగారు తప్పట్లేదు.
Also Read: Sania Mirza: ఆర్సీబీ మెంటర్గా సానియా..అందమంతా ఆ టీమ్లోనే!
పాక్తో తొలి పది ఓవర్ల వరకు బౌలర్లు ఆకట్టుకున్నా.. తర్వాతి పది ఓవర్లలో ఏకంగా 91 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. స్పిన్నర్ రాధా యాదవ్ మినహా బౌలర్లందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. కొన్ని మ్యాచ్ల నుంచి పేసర్ రేణుకా సింగ్ సత్తా చాటలేకపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వార్మప్ మ్యాచ్ల్లో సత్తా చాటిన అనుభవజ్ఞురాలు శిఖాను.. రేణుక లేదా పూజ స్థానంలో తుది జట్టులో తీసుకుంటారేమో చూడాలి. స్పిన్నర్లు దీప్తి, రాజేశ్వరి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరముంది. విండీస్ ఎక్కువగా కెప్టెన్ హేలీ మాథ్యూస్ మీద ఆధారపడుతోంది. బ్యాటింగ్లో ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది.
Also Read: Man Kills Partner: ప్రియురాలిని హత్య చేసి పరుపులో మూటకట్టేశాడు..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!