WPL 2023: విమెన్స్ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదిగో..తొలి మ్యాచ్ వీరి మధ్యే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అటు క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. తాజాగా ముగిసిన వేలంతో ఈ టోర్నీలో పాల్గొనే జట్లు కూడా ఖరారయ్యాయి. మొత్తం ఐదు జట్లు ఈ టోర్నీలో తలపడేందుకు రెడీగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ఫ్రాంచైజీలు వేలంలో మంచి జట్లను తయారు చేసుకున్నాయి. వేలంలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. ఆమె కోసం ఆర్సీబీ జట్టు రూ.3.4 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అలాగే ఢిల్లీ కూడా షెఫాలీ వర్మ సహా పలువురు కీలక ఆటగాళ్లతో బలమైన జట్టును సిద్ధం చేసుకుంది. వేలం ముగియడంతో టోర్నీకి అవసరమైన కీలకమైన దశ పూర్తయినట్లు అయింది. దీంతో ఇక టోర్నీ ప్రారంభం అవడమే మిగిలింది.
Also Read: Sania Mirza: ఆర్సీబీ మెంటర్గా సానియా..అందమంతా ఆ టీమ్లోనే!
Also Read
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
తాజాగా ఈ టోర్నీ షెడ్యూల్ను విడుదల చేసింది బీసీసీఐ. వచ్చే నెల 4వ తేదీన డబ్ల్యూపీఎల్ ప్రారంభం అవనుందని తెలిపింది. డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుందని పేర్కొంది. ఆ తర్వాత ఆదివారం మార్చి 5వ తేదీన రెండు మ్యాచులు జరుగుతాయి. ఈ టోర్నీ మొత్తంలో నాలుగు సార్లు డబుల్ హెడర్స్ జరగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లు 3.30 గంటలకు ప్రారంభమవుతాయి. సాయంత్రం జరిగే మ్యాచ్లు 7.30కు మొదలవుతాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, బ్రబోర్న్ స్టేడియాల్లో ఒక్కో మైదానంలో 11 మ్యాచ్లు జరుగుతాయి. లీగ్ దశలో చివరి మ్యాచ్ మార్చి 21న బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో యూపీ-ఢిల్లీ జట్టు తలపడతాయి. 24వ తేదీన డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మార్చి 26న బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ మొత్తాన్ని బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
🚨 NEWS 🚨: BCCI announces schedule for Women’s Premier League 2023. #WPL
More Details 🔽https://t.co/n92qVFwu1x
— Women's Premier League (WPL) (@wplt20) February 14, 2023
తాజావార్తలు
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!