Chocolate Syrup: చాక్లెట్ సిరప్లో చనిపోయిన ఎలుక.. ఫిర్యాదుపై స్పందించిన కంపెనీ
- ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరప్లో చనిపోయిన ఎలుక
- ఇన్స్టాగ్రామ్ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chocolate Syrup: ఇటీవల ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ప్యాకెట్లలో పాములు, ఎలుకలు, మానవుని వేళ్లు వస్తున్నాయి. ఇటీవల ముంబై నివాసి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఐస్క్రీమ్లో మానవ వేలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్శిల్ లో పాము కూడా వచ్చింది. ఇక మరో ఆన్ లైన్ ఆర్డర్ లో చనిపోయిన ఎలుక బయటపడింది. అవును జెప్టో ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుకను గుర్తించిన ఒక మహిళ పూర్తిగా షాక్ కు గురైంది. ప్రమీ శ్రీధర్ అనే మహిళ చాక్లెట్ సిరప్ లో ఎలుక వచ్చిన సంఘటనను వీడియోలో రికార్డు చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు హెర్షీ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో ఆమె ఫిర్యాదుపై కంపెనీ స్పందించింది. హెర్షీ కంపెనీ బ్రాండ్ ఇలా రాసుకొచ్చింది. “హాయ్, దీన్ని చూసి మేము చాలా చింతిస్తున్నాము. దయచేసి మాకు యూపీసీ, తయారీ కోడ్ను బాటిల్ నుంచి consumercare@hersheys.com రిఫరెన్స్ నంబర్ 11082163తో పంపండి, తద్వారా మా బృంద సభ్యులలో ఒకరు మీకు సహాయం చేయగలరు!” అని హెర్షీ కంపెనీ సమాధానం ఇచ్చింది.
Read Also: WhatsApp call Record : వాట్సాప్ కాల్ ఎలా రికార్డ్ చేసుకోవాలంటే..
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
ప్రమీ శ్రీధర్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వీడియో పోస్ట్ చేసి దాని కింద వివరాలను వెల్లడించారు. జెప్టో ఆర్డర్ లో షాకింగ్ సంఘటన ఒకటి చోటుచేసుకుందని.. సిరప్ ను ఒక కప్పులో పోయగా అందులో ఒక చనిపోయిన ఎలుక వచ్చిందని వెల్లడించారు. హెర్షే చాక్లెట్ సిరప్ని బ్రౌనీ కేక్లతో తినడానికి జెప్టోలో ఆర్డర్ చేశామని చెప్పారు. కేక్ పై పోస్తుండగా నల్లని వెంట్రుకల లాంటి పదార్థం వచ్చిందని, ఈ క్రమంలో సిరప్ ను డిస్పోజబుల్ గ్లాసులో పోసి చూడగా చనిపోయిన ఎలుకగా గుర్తించామన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియా యూజర్లు కూడా అంతే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హెర్షే కంపెనీపై దావా వేయొచ్చని, ఆహార భద్రత డిపార్టుమెంట్ వారికి ఫిర్యాదు చేయొచ్చని ఓ నెటిజన్ చెప్పారు. జెప్టో ఇక్కడ తప్పు చేయనందున హర్షేపై ఫిర్యాదు చేయమని పలువురు ఇతరులు ప్రమీ శ్రీధర్ ను కోరారు.
తాజావార్తలు
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
-
Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..