Wife and Husband: క్షణికావేశంలో భర్తలపై భార్యల దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife and Husband: ఇటీవల కాలంలో భర్తలపై భార్యల దాడులు ఎక్కువయ్యాయి. క్షణికావేశంలో దాడులు చేసి తర్వాత వారి జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. భార్యభర్తల బంధంలో కొన్ని సార్లు మనస్పర్థలు రావడం పరిపాటే. అవి వచ్చినప్పుడు ఎవరో ఒకరు రాజీపడి కూర్చుని మాట్లాడుకుంటే సర్ధుకుంటాయి.. కానీ దాడులు చేసుకుని నష్టపరుచుకుంటున్నారు.
Read Also:NASA: దారి మళ్లిన గ్రహశకలం.. నాసా డార్ట్ ప్రయోగం సక్సెస్
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
తాజాగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఓ భార్య తన భర్తపై యాసిడ్ పోసింది. చిన్న పాటి గొడవను మనసులో పెట్టుకొని భర్త ముఖంపై భార్య బాత్రూమ్ యాసిడ్తో దాడి చేసింది. ఈ సంఘటన రఘునాథపాలెం మండలంలో జరిగింది. ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. రేగులచెలకకు చెందిన ఉబ్బని రవి, సుజాత భార్యభర్తలు, వీరికి ఒక బాబు ఉన్నాడు. కొంతకాలంగా చిన్న చిన్న విషయాలపై ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి బాబును ఎత్తుకునే విష యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మంగళవారం ఉదయం లేచిన రవి పని కోసం ఖమ్మం బయలుదేరి గ్రామంలో కూడలిలో ఆటో కోసం నిలిచిఉన్నాడు. ఈ క్రమంలో సుజాత ఇంట్లోని బాత్రూమ్ యాసిడ్ను వాటర్ బాటిల్లో తీసుకొచ్చి రోడ్డుపై నిలిచి ఉన్న రవి ముఖం పై పోసింది. ఆయనతో పాటుగా సమీపంలోనే ఉన్న మరో వ్యక్తి కన్నెపోగు కిరణ్పై పడటంతో గాయపడ్డాడు. యాసిడ్తో దాడి చేసిన భార్యంపై భర్త రవి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సుజాతపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Read Also: Adani: ఇక పూర్తి స్థాయి టెలికాం సేవల్లోకి అదానీ
ఇదిలా వుంటే.. తమిళనాడు రాష్ట్రం రాణీపేట జిల్లా ఉరియూరులో మద్యం సేవించి, తనను చిత్రహింసలు పెడుతున్న భర్తపై ఆగ్రహించిన భార్య.. క్షణికావేశంలో గడ్డపారతో తిరగబడింది. ఈ దాడిలో భర్త చనిపోవడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఉరియూన్కు చెందిన సీరాలన్ సౌండ్ సర్వీసు దుకాణం నడుపుతున్నాడు. అతని భార్య శోభన. ఆ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కాగా మద్యానికి బానిసైన సీరాలన్.. ప్రతిరోజూ భార్యతో గొడవ పడడంతో పాటు ఆమెను కొట్టేవాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య వివాదం నెలకొనగా.. శోభన చేతికందిన గడ్డపారతో కొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. స్థానికులందించిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శోభనను అరెస్టు చేశారు.
- Tags
- acid
- acid attack
- chennai
- husband
- khammam
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!