టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా ధూత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది.. అక్కినేని నాగచైతన్య – చందు మొండేటి దర్శకత్వం లో రాబోతున్న మూడో సినిమా తండేల్..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది..
ఈ సినిమాకు రెండు క్లైమాక్స్ లను పిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. అదేంటి సినిమాకు మాములుగా ఒక క్లైమాక్స్ ఉంటుంది.. మరి ఈ సినిమాకు రెండేందుకు అనుకుంటున్నారా? తండేల్ కోసం రెండు క్లైమాక్స్ లు పరిశిలనలో ఉన్నాయట. చైతు సాయిపల్లవిల మధ్య ప్రేమను ఎలా ముగించాలనే దాని మీద ప్రస్తుతానికి చందు మొండేటి రెండు క్లైమాక్స్ లు రాసుకున్నారట. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద లోతుగా విశ్లేషించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని టాక్.. వీరిద్దరి చివరి షాట్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుదని తెలుస్తుంది..
గ్రామీణ ప్రేమకథ తండేల్ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది.. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ . మేకర్స్ థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ హక్కుల కోసం పెద్ద డీల్లను పొందుతున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్కు భారీ ధరకు కొనుగోలు చేసింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..