Team India: బ్యాటింగ్ నుంచి కెప్టెన్సీ వరకు.. టీమిండియా వరుస వైఫల్యాల వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: భారత్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు చెలరేగింది. టీమిండియాను 125 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, తాజా విజయంతో ఇంగ్లాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ విజేత అయిన భారత్తో ఆడబోయే మిగిలిన రెండు మ్యాచ్లలో ఏ ఒక్కటి గెలిచినా ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఇక, ఇంతకు ముందు ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో సైతం భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టీమిండియా వరుస పరాజయాల వెనుక కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత క్రికెట్ జట్టు ఇటీవలి కాలంలో వరుస పరాజయాలు చవిచూడటానికి ప్రధాన కారణం జట్టులో సమష్టి కృషి లోపించడమే. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం జట్టును తీవ్రంగా దెబ్బతీస్తోంది. పవర్ప్లే ఓవర్లలో ఓపెనర్లు త్వరగా వికెట్లు కోల్పోవడం వల్ల మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పెరుగుతోంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల స్వింగ్ బౌలింగ్ను, విదేశీ పిచ్లపై బౌన్స్ను ఎదుర్కోవడంలో బ్యాటర్ల సాంకేతిక లోపాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. దీనికి తోడు, స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం, డెత్ ఓవర్లలో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం మ్యాచ్లను చేజార్చుకోవడానికి కారణమవుతోంది. మరోవైపు మితిమీరిన ఐపీఎల్ మ్యాచ్ల షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా తీవ్ర అలసటకు గురవుతున్నారు. దీనివల్ల కీలకమైన అంతర్జాతీయ సిరీస్ల సమయంలో ప్రధాన ఆటగాళ్లు గాయాలబారిన పడుతున్నారు. పనిభార నిర్వహణ (వర్క్లోడ్ మేనేజ్మెంట్) లోపించడం వల్ల జట్టు కాంబినేషన్ తరచూ మారుతోంది. ఇది ఆటగాళ్లలో అభద్రతా భావాన్ని పెంచుతోంది. మైదానంలో క్యాచ్లు వదిలేయడం, పేలవమైన గ్రౌండ్ ఫీల్డింగ్ వల్ల ప్రత్యర్థి జట్టుకు అదనపు పరుగులు లభిస్తున్నాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
- ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కెప్టెన్సీ పరంగా చూస్తే శ్రేయస్ అయ్యారు ఇటీవల కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడ. ఈ కొత్త కెప్టెన్ మైదానంలో వ్యూహాత్మక మార్పులు చేయడంలో చురుకుదనం లోపించింది. ప్లాన్-ఎ విఫలమైనప్పుడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకపోవడం, ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో మానసిక ఒత్తిడిని జయించలేకపోవడం ‘చోకర్స్’ ముద్రను బలపరుస్తోంది. కోచింగ్ స్టాఫ్ సైతం ఆటగాళ్ల ఫామ్ను రీసెట్ చేయడంలో విఫలమవుతోంది. జట్టు ఎంపికలో నిలకడ లేకపోవడం మైనస్గా మారింది. టీమిండియా మళ్లీ పూర్వవైభవాన్ని అందుకోవాలంటే ఆటగాళ్లు ఫిట్నెస్ ప్రమాణాలను మెరుగుపరుచుకుంటూ, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని సమష్టి ప్రణాళికతో ఆడాల్సిందే.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!