Stock Market : ఫారిన్ ఇన్వెస్టర్ల ‘క్విట్ ఇండియా ప్రచారం’ జనవరిలోనే ఎందుకు మొదలవుతుంది ?
- స్టాక్ మార్కెట్లో క్విట్ ఇండియా ప్రచారం
- పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు
- గత నాలుగేళ్లుగా జనవరిలో ఇదే ట్రెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market : విదేశీ పెట్టుబడిదారులు జనవరి నెలలో స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుండి రూ.22 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. దీని కారణంగా స్టాక్ మార్కెట్లో అతి పెద్ద క్షీణత కనిపించింది. అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే విదేశీ పెట్టుబడిదారుల ‘క్విట్ ఇండియా ప్రచారం’ జనవరి నెలలోనే ఎందుకు ప్రారంభమవుతుంది? గత కొన్ని సంవత్సరాల డేటాను చెక్ చేయగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత నాలుగేళ్లుగా అంటే 2022 నుండి 2025 వరకు జనవరి నెలలో స్టాక్ మార్కెట్ నుండి విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడి ఉపసంహరణలు కొనసాగుతూనే ఉన్నాయి. 2021 సంవత్సరంలో చివరిసారిగా విదేశీ పెట్టుబడిదారులు జనవరి నెలలో స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టారు. ఈసారి విదేశీ పెట్టుబడిదారులు 2021 సంవత్సరం రికార్డును బద్దలు కొట్టగలరని.. దాదాపు రూ.35 వేల కోట్లు ఉపసంహరించుకోగలరని అంచనా.
Read Also:Vidyasagar Rao: అప్పుడు నాకోసం 5 గురు సీఎంలు వేయిట్ చేశారు.. ఇప్పుడు రేవంత్ను రిసీవ్ చేసుకున్నా..
Also Read
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ఈ నెలలో ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్ల నుండి విదేశీ ఇన్వెస్టర్లు రూ.22,194 కోట్లు ఉపసంహరించుకున్నారు. కంపెనీల బలహీనమైన త్రైమాసిక ఫలితాలు, డాలర్ బలోపేతం, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో సుంకాల యుద్ధం తీవ్రతరం అవుతుందనే భయాల మధ్య వాళ్లు తమ షేర్లను విక్రయిస్తున్నారు. డిసెంబర్ నెలలో ముందుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ.15,446 కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రపంచ, దేశీయ రంగాలలో ఎదురుగాలుల మధ్య, విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్లకు తమ ఎక్స్పోజర్ను తగ్గించుకున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు (జనవరి 10 వరకు) విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు షేర్ల నుండి రూ.22,194 కోట్లు ఉపసంహరించుకున్నారు. జనవరి 2 మినహా అన్ని ట్రేడింగ్ సెషన్లలో వాళ్లు నికర అమ్మకందారులుగా ఉన్నారు.
Read Also:The Family Man 3 : విడుదలకు సిద్ధమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’
2022 సంవత్సరం నుండి ఒక ప్రత్యేక ట్రెండ్ కనిపిస్తోంది. అంటే, జనవరి నెలలో విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ను వదిలి వెళ్తున్నారు. 2022 సంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే, విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుండి రూ.33,303 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత, 2023 సంవత్సరంలో ఈ సంఖ్య రూ.28,852 కోట్లుగా కనిపించింది. ఈ ధోరణి 2024 సంవత్సరంలోనూ కొనసాగింది. స్టాక్ మార్కెట్ నుండి రూ.25,744 కోట్లు ఉపసంహరించబడ్డాయి. 2022 సంవత్సరంలో గరిష్ట మొత్తంలో డబ్బు ఉపసంహరించుకోవడం గమనించదగ్గ విషయం. ఆ తరువాత ఈ మొత్తం ప్రతి సంవత్సరం జనవరి నెలలో తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే.. జనవరి నెలలో సగం కూడా గడిచిపోలేదు. ఇప్పటికే రూ.22,194 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈసారి విదేశీ పెట్టుబడులు రూ.35 వేల కోట్లకు పైగా చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది 2022 సంవత్సరం సంఖ్యను బద్దలు కొడుతుంది.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!