భారతీయ రైల్వే రైలు టిక్కెట్లను రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు.. ఆఫ్లైన్, ఆన్లైన్ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ టిక్కెట్ల కోసం సాధారణంగా రైల్వే స్టేషన్లోని కౌంటర్కు వెళ్లాలి. కౌంటర్ టిక్కెట్ల ధరలు.. ఆన్లైన్ టిక్కెట్ల కంటే తక్కువ ఉంటాయి. అయితే, ఈ ధర వ్యత్యాసం ఎందుకు జరుగుతుందో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రాజ్యసభలో వివరణ ఇచ్చారు. రైల్వే కౌంటర్ల వద్ద క్యూలలో టిక్కెట్లు కొనేవారి కంటే ఐఆర్సిటిసి ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులు సర్వీస్ ఛార్జీలు, లావాదేవీల రుసుము కారణంగా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో తెలిపింది.
Read Also: Kshama Sawant: ఇండో అమెరికన్ నేత క్షమా సావంత్కు ఎమర్జెన్సీ వీసా తిరస్కరించిన భారత్!
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టిక్కెట్ల ధరలో వ్యత్యాసం గురించి శివసేన సభ్యుడు సంజయ్ రౌత్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ.. “ఆన్లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని అందించడానికి IRCTC ఎక్కువ ఖర్చు చేస్తుంది. టిక్కెట్ మౌలిక సదుపాయాలు నిర్వహించడం, అప్గ్రేడ్ చేయడం, విస్తరించడం వంటి ఖర్చులను భరించడానికి IRCTC సర్వీస్ ఛార్జీలు విధిస్తుంది” అని అన్నారు. దీనితో పాటు.. ప్రయాణికులు బ్యాంకులకు లావాదేవీ ఛార్జీలను కూడా చెల్లిస్తారని అశ్విని వైష్ణవ్ అన్నారు.
Read Also: YSRCP: అక్కడ వైసీపీ నేతలకు కొత్త టెన్షన్..!
ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్: ప్రయోజనాలు
ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్ అనేది ప్రయాణీకులకు చాలా సౌకర్యవంతంగా మారిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. “ప్రస్తుతం 80 శాతానికి పైగా రిజర్వ్ చేయబడిన టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేయబడుతున్నాయి. IRCTC ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ ద్వారా ప్రయాణీకులు కౌంటర్కి వెళ్లి టిక్కెట్లు కొనడం ఇబ్బందిని నివారించవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు సమయం, రవాణా ఛార్జీలను కూడా ఆదా చేయవచ్చు” అని పేర్కొన్నారు. “IRCTC ఆన్లైన్లో రిజర్వ్ చేసిన టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఇది ప్రయాణీకులకు రిజర్వేషన్ కౌంటర్కు వెళ్లి టిక్కెట్లు బుక్ చేసుకునే ఇబ్బంది నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే.. ప్రయాణ సమయం, రవాణా ఛార్జీలను కూడా ఆదా చేస్తుంది” అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.