Railway Ticket: రైల్వే కౌంటర్ టికెట్ కంటే ఆన్లైన్ టికెట్ ఎందుకు ధర ఎక్కువ తెలుసా..?
- ఆఫ్లైన్, ఆన్లైన్ పద్ధతిలో రైల్వే టికెట్ల బుకింగ్ ఆఫ్లైన్ టిక్కెట్ల కోసం రైల్వే స్టేషన్లోని కౌంటర్కు వెళ్లాలి కౌంటర్ టిక్కెట్ల ధరలు.. ఆన్లైన్ టిక్కెట్ల కంటే తక్కువ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే రైలు టిక్కెట్లను రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు.. ఆఫ్లైన్, ఆన్లైన్ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ టిక్కెట్ల కోసం సాధారణంగా రైల్వే స్టేషన్లోని కౌంటర్కు వెళ్లాలి. కౌంటర్ టిక్కెట్ల ధరలు.. ఆన్లైన్ టిక్కెట్ల కంటే తక్కువ ఉంటాయి. అయితే, ఈ ధర వ్యత్యాసం ఎందుకు జరుగుతుందో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రాజ్యసభలో వివరణ ఇచ్చారు. రైల్వే కౌంటర్ల వద్ద క్యూలలో టిక్కెట్లు కొనేవారి కంటే ఐఆర్సిటిసి ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులు సర్వీస్ ఛార్జీలు, లావాదేవీల రుసుము కారణంగా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో తెలిపింది.
Read Also: Kshama Sawant: ఇండో అమెరికన్ నేత క్షమా సావంత్కు ఎమర్జెన్సీ వీసా తిరస్కరించిన భారత్!
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టిక్కెట్ల ధరలో వ్యత్యాసం గురించి శివసేన సభ్యుడు సంజయ్ రౌత్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ.. “ఆన్లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని అందించడానికి IRCTC ఎక్కువ ఖర్చు చేస్తుంది. టిక్కెట్ మౌలిక సదుపాయాలు నిర్వహించడం, అప్గ్రేడ్ చేయడం, విస్తరించడం వంటి ఖర్చులను భరించడానికి IRCTC సర్వీస్ ఛార్జీలు విధిస్తుంది” అని అన్నారు. దీనితో పాటు.. ప్రయాణికులు బ్యాంకులకు లావాదేవీ ఛార్జీలను కూడా చెల్లిస్తారని అశ్విని వైష్ణవ్ అన్నారు.
Read Also: YSRCP: అక్కడ వైసీపీ నేతలకు కొత్త టెన్షన్..!
ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్: ప్రయోజనాలు
ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్ అనేది ప్రయాణీకులకు చాలా సౌకర్యవంతంగా మారిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. “ప్రస్తుతం 80 శాతానికి పైగా రిజర్వ్ చేయబడిన టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేయబడుతున్నాయి. IRCTC ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ ద్వారా ప్రయాణీకులు కౌంటర్కి వెళ్లి టిక్కెట్లు కొనడం ఇబ్బందిని నివారించవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు సమయం, రవాణా ఛార్జీలను కూడా ఆదా చేయవచ్చు” అని పేర్కొన్నారు. “IRCTC ఆన్లైన్లో రిజర్వ్ చేసిన టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఇది ప్రయాణీకులకు రిజర్వేషన్ కౌంటర్కు వెళ్లి టిక్కెట్లు బుక్ చేసుకునే ఇబ్బంది నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే.. ప్రయాణ సమయం, రవాణా ఛార్జీలను కూడా ఆదా చేస్తుంది” అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?