Economic Survey: ఎందుకు రూపాయి పతనం..? ఎలా కట్టడి చేయాలి..? రహస్యాన్ని బయటపెట్టిన సర్వే..
- పార్లమెంటులో ఆర్థిక సర్వే 2026ను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్ ..
- రూపాయి ఎందుకు పతనమవుతోంది...
- దాన్ని ఎలా ఆపవచ్చు? రహస్యాన్ని బయటపెట్టిన ఆర్థిక సర్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Economic Survey: డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ గురువారం ఆల్టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. ఒక డాలర్కు రూపాయి విలువ 92కు పడిపోవడం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 2.5 శాతం తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెపో రేటు కోతలను నిలిపివేయడం ఈ పతనానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆర్థిక సర్వే–2026ను ప్రవేశపెట్టారు. ఈ సర్వేలో భారత రూపాయి బలహీనతపై కీలక విశ్లేషణను పొందుపరిచారు. రూపాయి ఎందుకు క్షీణిస్తోంది, దాని వల్ల కలిగే ప్రభావాలు ఏమిటి, దీనిని ఎలా నియంత్రించవచ్చనే అంశాలపై స్పష్టతనిచ్చింది.
రూపాయి ఎందుకు పడిపోతోంది..?
ఆర్థిక సర్వే ప్రకారం, భారత రూపాయి నిరంతర పతనం దేశ ఆర్థిక మౌలికాంశాలను పూర్తిగా ప్రతిబింబించడం లేదు. రూపాయి తన వాస్తవ సామర్థ్యానికి మించి బలహీనపడుతోందని నివేదిక పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన బృందం రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, అమెరికా విధించిన సుంకాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించడంలో రూపాయి క్షీణత సహకరిస్తోంది. మరోవైపు, అమెరికా సుంకాల పెరుగుదలే రూపాయి పతనానికి ప్రధాన కారణం కాదని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ తగ్గడం పూర్తిగా హానికరం కాదని, ఇది భారత ఎగుమతులకు కొంత లాభాన్ని చేకూరుస్తుందని పేర్కొంది.
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
పెట్టుబడిదారుల ఆందోళన
అయితే, రూపాయి బలహీనత విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతోందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంపై వారు వెనుకంజ వేయడానికి గల కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. దేశంలోకి మూలధన ప్రవాహం తగ్గడం, పెట్టుబడుల ఉపసంహరణలు పెరగడం వల్లే రూపాయి బలహీనత ఏర్పడిందని నివేదిక పేర్కొంది.
రూపాయి పతనాన్ని ఎలా కట్టడి చేయాలి..?
రూపాయి పతనాన్ని ఎదుర్కోవడానికి పలు చర్యలు తీసుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. పెరుగుతున్న దిగుమతి బిల్లును సమర్థంగా నిర్వహించాలంటే, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే విధానాలు అవసరమని పేర్కొంది. అలాగే, విదేశీ కరెన్సీలో ఎగుమతి ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించింది. గత ఏడాది కాలంలో రూపాయి విలువ 6 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది. దీని కారణంగా దిగుమతులు ఖరీదైనవిగా మారగా, ఎగుమతులు చౌకగా మారి భారత ఆర్థిక వ్యవస్థకు కొంత పోటీ సామర్థ్యం పెరిగింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు, ఎగుమతులపై మరింత దృష్టి పెట్టాలని ఆర్థిక సర్వే పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!