Economic Survey: ఎందుకు రూపాయి పతనం..? ఎలా కట్టడి చేయాలి..? రహస్యాన్ని బయటపెట్టిన సర్వే..
- పార్లమెంటులో ఆర్థిక సర్వే 2026ను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్ ..
- రూపాయి ఎందుకు పతనమవుతోంది...
- దాన్ని ఎలా ఆపవచ్చు? రహస్యాన్ని బయటపెట్టిన ఆర్థిక సర్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Economic Survey: డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ గురువారం ఆల్టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. ఒక డాలర్కు రూపాయి విలువ 92కు పడిపోవడం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 2.5 శాతం తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెపో రేటు కోతలను నిలిపివేయడం ఈ పతనానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆర్థిక సర్వే–2026ను ప్రవేశపెట్టారు. ఈ సర్వేలో భారత రూపాయి బలహీనతపై కీలక విశ్లేషణను పొందుపరిచారు. రూపాయి ఎందుకు క్షీణిస్తోంది, దాని వల్ల కలిగే ప్రభావాలు ఏమిటి, దీనిని ఎలా నియంత్రించవచ్చనే అంశాలపై స్పష్టతనిచ్చింది.
రూపాయి ఎందుకు పడిపోతోంది..?
ఆర్థిక సర్వే ప్రకారం, భారత రూపాయి నిరంతర పతనం దేశ ఆర్థిక మౌలికాంశాలను పూర్తిగా ప్రతిబింబించడం లేదు. రూపాయి తన వాస్తవ సామర్థ్యానికి మించి బలహీనపడుతోందని నివేదిక పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన బృందం రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, అమెరికా విధించిన సుంకాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించడంలో రూపాయి క్షీణత సహకరిస్తోంది. మరోవైపు, అమెరికా సుంకాల పెరుగుదలే రూపాయి పతనానికి ప్రధాన కారణం కాదని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ తగ్గడం పూర్తిగా హానికరం కాదని, ఇది భారత ఎగుమతులకు కొంత లాభాన్ని చేకూరుస్తుందని పేర్కొంది.
Also Read
- Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
పెట్టుబడిదారుల ఆందోళన
అయితే, రూపాయి బలహీనత విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతోందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంపై వారు వెనుకంజ వేయడానికి గల కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. దేశంలోకి మూలధన ప్రవాహం తగ్గడం, పెట్టుబడుల ఉపసంహరణలు పెరగడం వల్లే రూపాయి బలహీనత ఏర్పడిందని నివేదిక పేర్కొంది.
రూపాయి పతనాన్ని ఎలా కట్టడి చేయాలి..?
రూపాయి పతనాన్ని ఎదుర్కోవడానికి పలు చర్యలు తీసుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. పెరుగుతున్న దిగుమతి బిల్లును సమర్థంగా నిర్వహించాలంటే, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే విధానాలు అవసరమని పేర్కొంది. అలాగే, విదేశీ కరెన్సీలో ఎగుమతి ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించింది. గత ఏడాది కాలంలో రూపాయి విలువ 6 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది. దీని కారణంగా దిగుమతులు ఖరీదైనవిగా మారగా, ఎగుమతులు చౌకగా మారి భారత ఆర్థిక వ్యవస్థకు కొంత పోటీ సామర్థ్యం పెరిగింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు, ఎగుమతులపై మరింత దృష్టి పెట్టాలని ఆర్థిక సర్వే పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?