Arshad Nadeem: క్రికెటర్ కావాల్సిన వాడు, ఒలింపిక్స్ విన్నర్ అయ్యాడు..
- పాకిస్తాన్లో మారుమోగుతున్న అర్షద్ నదీమ్ పేరు..
- 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్కి ఒలింపిక్స్లో స్వర్ణం..
- క్రికెటర్ కావాల్సిన వాడు ఒలింపిక్ విన్నర్ అయ్యాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshad Nadeem: అర్షద్ నదీమ్.. ఇప్పుడు ఈ పేరు పాకిస్తాన్లో సంచలనంగా మారింది. మన ఇండియా కూడా ఫేమస్ అయ్యాడు. పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రో ఈవెంట్లో ఏకంగా స్వర్ణం సాధించాడు. మన దేశానికి చెందిన నీరజ్ చోప్రా రజతం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకాన్ని గెలుచుకున్న తొలి పాకిస్తాన్ అథ్లెట్గా అర్షద్ నదీమ్ చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్లలో పాకిస్తాన్కి ఇదే తొలి స్వర్ణపతకం. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకున్నా, పూర్తిగా పేదరికం బ్యాక్గ్రౌండ్ కలిగిన అర్షద్ నదీమ్ సాధించిన ఘనత ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.
Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారు..? హిండెన్బర్గ్ రిపోర్ట్పై రాహుల్ గాంధీ…
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
నిజానికి అర్షద్ ముందుగా క్రికెటర్ కావాలనుకున్నట్లు ఆయన సోదరుడు వెల్లడించారు. అయితే, అతను తన కలను వదిలేసుకోవాల్సి వచ్చిందని సోదరుడు షాహిద్ అన్నారు. ఇందుకు దోహదం చేసిన పరిస్థితుల్ని వివరించాడు. ‘‘మాది తొమ్మిది మంది సభ్యులు ఉన్న కుటుంబం. ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు, మా తల్లిదండ్రులు ఉండేవారం. మా నాన్న భవన నిర్మాణ కార్మికుడు. మా కుటుంబాన్ని పోషించే ఏకైక వ్యక్తి. క్రికెట్ ఖరీదైన క్రీడ కావడంతో దానిని భరించలేకపోయాము’’ అని షాహిద్ చెప్పారు.
పాఠశాలలో ఉన్న సమయంలో అతను క్రీడల వైపు ఆకర్షితమయ్యాడని షాహిద్ చెప్పాడు. మొదట్లో అర్షద్ 200 మీటర్స్, 400 మీటర్స్ లాంగ్ జంప్, జావెలిన్ ఇలా అన్నింటిలో పాల్గొనేవాడని చెప్పారు. అయితే మా స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు నదీమ్ ఏదో ఒక దానిపై దృష్టిపెట్టాలని సలహా ఇవ్వడంతో అతను జావెలిన్ ఎంచుకున్నారని చెప్పాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో అద్బుతమైన ఫీట్ను ప్రదర్శించినందుకు ఏస్ అథ్లెట్ అర్షద్ నదీమ్ను పాకిస్తాన్ దేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారం హిలాల్-ఎ-ఇమ్తియాజ్తో సత్కరిస్తుంది. వచ్చే వారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘అజ్మ్-ఇ-ఇస్తేహ్కామ్’ (స్థిరత్వానికి నిబద్ధత) పేరుతో స్మారక స్టాంపును విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..