Delhi Election Result: లెక్కింపు సమయంలో ప్రతి ఈవీఎం నుండి ఓట్లు ఎందుకు తీసివేస్తారు.. ఆ రూల్స్ ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Election Result: ఢిల్లీ అసెంబ్లీ 2025 ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్ జరిగింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం 24 గంటల్లోపే ఢిల్లీలో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారో స్పష్టమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విజయాలు సాధిస్తుందా లేదా చాలా కాలం తర్వాత బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందా? ఎగ్జిట్ పోల్స్ను పరిశీలిస్తే, కాంగ్రెస్ ఎక్కడా రేసులో ఉన్నట్లు అనిపించడం లేదు.
ఓట్ల లెక్కింపు రేపు అంటే ఫిబ్రవరి 8న జరుగుతుంది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో, ఏ పార్టీ ఏ సీటును గెలుచుకుందో ప్రకటిస్తారు. ఈవీఎం ద్వారా ఓటింగ్ జరిగినప్పుడు ఓట్ల లెక్కింపు చాలా త్వరగా పూర్తవుతుంది. తరువాత ముందుగా దాని నుండి కొన్ని ఓట్లను తీసివేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
- AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
- Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
Read Also:REPO Rate: రెపో రేటు అంటే ఏంటి? ఇది తగ్గితే.. సామాన్యుడికి ఏం లాభం?
లెక్కింపు సమయంలో ఈవీఎంల నుండి ఓట్లను ఎందుకు తీసివేస్తారు?
భారతదేశంలో ఓటు వేయడానికి ఈవీఎంలను ఉపయోగిస్తారు. ఈవీఎం ద్వారా ఓటింగ్ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. అలాగే లెక్కింపు కూడాను. కానీ ఈవీఎంలను ఉపయోగించి ఓట్ల లెక్కింపు జరిగినప్పుుడు వాటిలో కొన్ని ఓట్లు తగ్గుతాయి. అలా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తున్నారా.. ఇది ఎన్నికల సంఘం నిబంధనల పరిధిలో జరుగుతుంది.
వాస్తవానికి ఈవీఎంల తో ఓటింగ్ ప్రారంభం అయినప్పుడు దానికి ముందు ఈవీఎం యంత్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో నిర్ధారించుకుంటారు. ఈ కారణంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మొదట తమ ఓటును వేసి, ఆ తర్వాత చెక్ చేస్తారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే, యంత్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ప్రతి ఒక్కరి ముందు ఉన్న బటన్ను నొక్కితే సరిపోతుంది. లెక్కింపు జరిగినప్పుడు ఈ ఓట్లను రీసెట్ చేయలేము. అప్పుడు ఆ కాలంలో ఇవి తగ్గుతాయి.
భారత ఎన్నికల సంఘం ద్వారా అన్ని పోలింగ్ బూత్లకు ఫారం 17C జారీ చేస్తారు. ఓటింగ్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఫారంలో నమోదు చేయాలి. ఈవీఎం యంత్రాన్ని టెస్ట్ చేసే సమయంలో ఎన్ని ఓట్లు పడ్డాయి.. ఏ పార్టీ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వేశారో కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ సమాచారమంతా ఫారమ్లో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఓటింగ్ సమయంలో ప్రతి ఈవీఎం నుంచి ఒకే సంఖ్యలో ఓట్లను తొలగిస్తారు.
Read Also:CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..
తాజావార్తలు
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..